Amit Shah: అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్లో నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని కేవలం ఓటర్ల జాబితా నుంచి తొలగించడం మాత్రమే కాకుండా, దేశం నుంచే బహిష్కరించే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.నక్సల్స్ మాదిరిగానే చొరబాటుదారులనూ మరో ఐదేళ్లలో ఏరివేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారని గుర్తుచేశారు.
Read Also: INS Vikrant : INS విక్రాంత్ ఖరీదు అక్షరాల రూ. 23వేల కోట్లు..దీని ప్రత్యేకతలు ఇవే !!
వచ్చే ఐదేళ్ల కాలంలో అస్సాంను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాము
వారు చెప్పిన మాటలు విశ్వసించవద్దని, ఎందుకంటే వారికి చొరబాటుదారులే ఓటు బ్యాంకు కాబట్టి వారిని పంపించలేరని అన్నారు.చొరబాటుదారులను రక్షించాలనే హస్తం పార్టీ విధానాలు అస్సాంకు ముప్పుగా పరిణమించాయని విమర్శించారు. ఒకవేళ వారిపై చర్యలు తీసుకునే విషయానికి వస్తే కాంగ్రెస్ కట్టుబడి ఉంటే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ విషయాన్ని పొందుపర్చాలని డిమాండ్ చేశారు. వచ్చే ఐదేళ్ల కాలంలో అస్సాంను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: