AI Summit: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (sundar-pichai), ఢిల్లీకి రానున్నారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో అక్కడ జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఈ టెక్ దిగ్గజాలు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు అనేక దేశాలు నుంచి ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఢిల్లీలోని హోటల్ గదుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో లగ్జరీ సూట్ ధర రూ.2 లక్షలు ఉండేది. ఇప్పుడు అది ఏకంగా రూ.32 లక్షలకు పెరిగిపోయింది.
Read Also: Ambati Rambabu: ఇవాళ అంబటి బెయిల్ పిటిషన్లపై తీర్పు

ఈ ఏఐ సమ్మిట్ కోసం దాదాపు 100 దేశాల నుంచి 35 వేల మంది ప్రతినిధులు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వివిధ దేశాల్లో నాలుగుసార్లు మాత్రమే ఈ సమ్మిట్ జరిగింది. వీటన్నటికంటే భారత్లో జరగనున్న సమ్మిట్ అతిపెద్దది. 15-20 మంది ప్రభుత్వాధినేతలు, పలువురు విదేశీయ మంత్రులు, అలాగే ఏఐ సంస్థలకు చెందిన 500 మంది ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. భారత్లో ఏఐ సమ్మిట్ ఉంటుందని గతేడాదే ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు గ్లోబల్ సౌత్ దేశాల్లో నిర్వహిస్తున్న మొదటి ఏఐ సమ్మిట్ ఇదే కావడం మరో విశేషం. ఈ సదస్సు నిర్వహించడం వల్ల అంతర్జాతీయ స్థాయి టెక్ సమ్మిట్లు రాబోయే రోజుల్లో ఢిల్లీలో మరిన్ని జరిగే ఛాన్స్ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: