हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

అతిశీ సహా ఆ ఇద్దరు కార్యకర్తలపై కేసు నమోదు!

Vanipushpa
అతిశీ సహా ఆ ఇద్దరు కార్యకర్తలపై కేసు నమోదు!

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రోజు ఎన్నికలు జరగబోతుండగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశీకి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు. అలాగే ఆమె మద్దతు దారులైన మరో ఇధ్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఓ హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడగా.. వారిపై కూడా కేసులు నమోదు చేశారు. దీంతో ఆప్ నేతలంతా.. పోలీసులు కావాలనే తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు.

గురువారం రోజే ఢిల్లీలో ఎన్నికలు జరగబోతుండగా.. మంగళ వారం రోజు పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీపై కాగా.. మరో కేసు ఆప్ మద్దతుదారులపై. సోమవారం రోజు రాత్రి.. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ పది వాహనాల్లో 60 మంది మద్దతుదారులతో కలిసి ఫతేసింగ్ మార్గ్‌కు చేరుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆమెను తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. అయితే అతిశీ తిరిగి వెళ్లేందుకు నిరాకరించారు.
ఈక్రమంలోనే గోవింద్‌పురి పోలీస్ హెడ్ కానిస్టేబుల్.. ఆప్ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుండగా వీడియో తీశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సీఎం అతిశీ మద్దతుదారులు అష్మిత్, సాగర్ మెహతాలు హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. ఇద్దరూ కలిసి అతడిని కొట్టగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలోనే అష్మిత్, సాగర్ మెహతాలపై కేసులు నమోదు చేశారు. మరోవైపు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించిన సీఎం అతిశీపై కేసు పెట్టారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870