हिन्दी | Epaper

మహిళలకు 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవులు..ఎక్కడ అంటే?

Vanipushpa
మహిళలకు 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవులు..ఎక్కడ అంటే?

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు అండగా ఉండేందుకు మరో సంచలన నిర్ణయానికి తెరతీసింది. అధికారంలో ఉన్న సుఖ్వీందర్ సుఖు మహిళల సంక్షేమం కోసం పలు పథకాలను తీసుకుని వస్తున్నారు. తాజాగా ఇప్పటినుంచి మహిళా ఉద్యోగులకు 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవులు మంజూరు చేయనుంది. అయితే ఈ సెలవులు అందరు మహిళా ఉద్యోగులకు మాత్రం కాదని హిమాచల్ ప్రదేశ్ సర్కార్ తేల్చి చెప్పింది. గర్భిణీలకు డెలివరీ సమయంలో పుట్టిన బిడ్డ చనిపోవడం లేదా డెలివరీ తర్వాత బిడ్డను కోల్పోయిన ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు ఈ 60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవును ఉంటుందని స్పష్టం చేసింది.
6 నెలలు ప్రసూతి సెలవులు
దీనికి సంబంధించి తాజాగా సుఖ్వీందర్ సింగ్ సుఖు సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకు ఇప్పటివరకు 180 రోజులు (6 నెలలు) ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. అయితే ఈ ప్రసూతి సెలవులకు ఎలాంటి అర్హతలు ఉండాలో.. కొత్తగా ప్రకటించిన ప్రత్యేక ప్రసూతి సెలవులకు కూడా అవే అర్హతలు అని హిమాచల్ సర్కార్ వెల్లడించింది. కానీ ఈ ప్రత్యేక ప్రసూతి సెలవులు మాత్రం డెలివరీ సమయంలో లేదా ఆ తర్వాత పుట్టిన శిశువు చనిపోయిన వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే

అయితే గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో డెలివరీలు చేసుకున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రత్యేక ప్రసూతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. 9 నెలల పాటు కడుపులో మోసిన బిడ్డ.. కళ్లు తెరిచే సమయంలో, తెరిచిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం అంటే ఆ తల్లికి.. అంతకుమించిన శోకం ఇంకోటి ఉండదని హిమాచల్ ప్రభుత్వం తెలిపింది. అందుకే అలాంటి తీవ్ర విషాదకరమైన పరిస్థితుల కారణంగా వారికి కలిగే శారీరక, మానసిక బాధ నుంచి బయటికి వచ్చేందుకు ఈ 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవ్స్ ఉపయోగపడుతాయని పేర్కొంది.
ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత
ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా మహిళల ఆరోగ్యం, వారి శ్రామిక శక్తిని ఉపయోగించడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చెబుతుందని తెలిపాయి. ఇక ఇలాంటి విధానాన్ని తీసుకురావడం ద్వారా మంచి పాలనకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు అవుతుందని వెల్లడించాయి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870