Telugu film : ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నిర్మాతల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాత అంటే ‘ఇచ్చేవాడు’ అని, కానీ ఇప్పుడు ఇచ్చిన వారినే శాసించే స్థాయికి పరిశ్రమ చేరుకుందని ఆయన అన్నారు. నిర్మాతలకు తగిన గౌరవం తగ్గిపోయిందనే భావన వ్యక్తం చేశారు.
సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన దిల్ రాజు, తాను పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా తక్కువ సినిమాలు నిర్మించారని గుర్తు చేశారు. తన కెరీర్లో కీలకమైన ‘దిల్’ సినిమాను హిందీలో నిర్మించాలని పూర్ణచంద్రరావు ఆసక్తి చూపినప్పుడు, హక్కుల విషయమై అడిగారని చెప్పారు. “ఆయన నిర్మిస్తే హక్కులు ఉచితంగా ఇస్తాను” అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
Read Also: ICC Women’s T20 rankings 2026: రెండో స్థానానికి దీప్తి శర్మ

అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పణలో తాను ఒక సినిమా నిర్మించనున్నట్లు ప్రకటించిన దిల్ రాజు, విలువలతో కూడిన మంచి కథతో ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం తీస్తానని హామీ ఇచ్చారు. నిర్మాతలకు గౌరవం తిరిగి రావాలంటే మంచి కంటెంట్తో ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: