లంచం పుచ్చుకుంటూ దొరికిన ఇరిగేషన్ శాఖ అధికారి
కార్యాలయం సోదాలో ఎసిబికి దొరికిన మద్యం
మార్కాపురం : ప్రకాశం జిల్లా, జల వనరుల శాఖ ఒంగోలు జిల్లా మార్కాపురం డివిజన్ కార్యాలయం పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు, ఈ దాడులలో ఒక గుత్తేదారుడినుండి 30 వేల రూపాయలను లంచంగా పుచ్చుకుంటూ ఇరిగేషన్ శాఖ సీనియర్ అసిస్టెంట్, కార్యాలయ హెబ్రీ కే శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు, అంతేకాకుండా అధికారులు కార్యాలయం సోదా నిర్వహించినప్పుడు శ్రీనివాసరావు (Srinivasa Rao) ఆఫీసుగదిలో మద్యం దొరికినట్లు తెలిసింది, ఈ సందర్భంగా ఏసీబీ అధికారి పాత్రికేయులతో మాట్లాడుతూ జల వనరులకు సంబంధించి ఒక గుత్తేదారుడు చేసిన మూడు అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కావలసి ఉంది, సదరూ బిల్లులను సకాలంలో తయారుచేసి మంజూరు చేయించేందుకుగాను గుత్తేదారుడు నుండి సీనియర్ అసిస్టెంట్ అయిన కే శ్రీనివాసరావు 30 వేలరూపాయలను లంచంగా ఇవ్వమని కోరినట్లు గుత్తేదారులు అనిశా అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.

అధికారులు
గుత్తేదారుడు అనిశా అధికారులకు ఆశ్రయించడంతో సోమవారం ఏసీబీ బృందం (ACB team) గుత్తేదారుడు ప్రణాళిక ప్రకారం కార్యాలయం పై దాడులు నిర్వహించారు, గుత్తేదారుడు నుండి ఇరిగేషన్ శాఖ సీనియర్, శ్రీనివాసరావు నగదును పుచ్చుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు, ఇదే సమయంలో అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహించి దస్త్రాలు పరిశీలిస్తున్న సమయంలో కార్యాలయంలో మద్యం సీసాలు లభ్యమయ్యాయి, ఈ విషయాన్ని పాత్రికేయులు ఏసిబి అధికారులకు ప్రశ్నిస్తూ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అని అడగగా పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని దాటవేశారు ఈ దాడులలో నెల్లూరు ప్రకాశం జిల్లాల ఏసీబీ డీఎస్పీ ఎస్ శిరీష సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: TTD: ఢిల్లీ టిటిడి కళాశాలలో వృత్తి కోర్సులు