ఉపాధ్యాయుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త యాప్ తీసుకొచ్చింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ‘లీప్’ (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) పేరుతో ఒక సమగ్ర యాప్ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణ వంటి వాటి కోసం వేర్వేరు యాప్లు వాడేవారు. పాఠ్యపుస్తకాల పంపిణీ, మన బడి- నాడు నేడు, పీఎంశ్రీ వంటి వివరాలు నమోదు చేయడానికి కూడా వేర్వేరు యాప్లు ఉండేవి. చాలా యాప్లు ఉండడం వల్ల వాటి ఐడీలు(ID), పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవడం టీచర్లకు కష్టంగా ఉండేది. ఇప్పుడు ఉపాధ్యాయులు ముఖ ఆధారిత హాజరు కోసం ఒక ఐడీ, పాస్వర్డ్తో యాప్లో లాగిన్ అవ్వవచ్చు. ఈ యాప్లో స్కూల్, టీచర్, స్టూడెంట్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డ్యాష్బోర్డు అనే ఆరు విభాగాలు ఉన్నాయి.ఈ లీప్ యాప్ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ ప్రభుత్వం(AP Government) తెలిపింది. లీప్ యాప్ ద్వారా హాజరు తప్పనిసరి చేసినట్లుగా ఆ రిపోర్ట్ ఆధారంగానే జీతం చెల్లిస్తారనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ‘రాష్ట్ర విద్యాశాఖ ‘లీప్ యాప్’ ద్వారా హాజరును తప్పనిసరి చేసిందని హాజరు నివేదిక ఆధారంగా వేతనం లెక్కేస్తారని ‘లీప్ యాప్'(Leap App)లో హాజరు నమోదు కాకుంటే, ఆ రోజుకు వేతనం కట్ చేస్తారని ఒక దినపత్రికలో వచ్చిన వార్త అబద్ధం. అలాంటి యాప్ ఏదీ లేదు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ సిబ్బంది కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రజలు కానీ ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మవద్దు’ అంటూ ట్వీట్ చేశారు.
తప్పనిసరి
‘రాష్ట్ర విద్యాశాఖ లీప్ యాప్లో హాజరును తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ నిర్దేశించిన సమయాల్లో ఈ యాప్ ద్వారా హాజరు వేయాలని సూచించింది. ఈ లీప్ యాప్ హాజరు నివేదిక ఆధారంగానే నెల జీతాన్ని కచ్చితంగా లెక్కించనున్నారు. యాప్లో హాజరు నమోదుకాకుంటే ఆ రోజు సెలవుగా పరిగణించి జీతంలో కోత విధిస్తారు. ఈ విధానాన్ని పాఠశాల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది(School Education Office Staff)కి పరిమితి చేయగా త్వరలో ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయనున్నట్లు సమాచారం’ అంటూ ప్రచారం జరుగుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ లీప్ యాప్ అటెండెన్స్ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాప్ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది,అటెండెన్స్, జీతానికి సంబంధించి ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం జరిగితే సోషల్ మీడియా వేదికగా క్లారిటి తీస్తోంది.
Read Also: Andhra Pradesh: తెరపైకి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపాలని ప్రతిపాదన