గత కొద్ది రోజులుగా ఊగిసలాడుతున్న బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేమితో విలువైన లోహాల ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో యూఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలపై చర్చలు కొనసాగిస్తున్నారు. దీంతో డాలర్ ఆధారిత ఆస్తులపై పెట్టుబడులను పెట్టాలా వద్దా అని ఆలోచనలో పడిపోయారు. దీనికి తోడు అమెరికా(America)-ఇరాన్ దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావడంతో Gold ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే సస్పెన్స్ కూడా నెలకొంది. చర్చలు సఫలమైతే తగ్గడం లేదా చర్చలు వికటిస్తే పసిడి పెరుగుదల ఖాయం అనే స్థితికి ఇన్వెస్టర్లు వచ్చారు. ఇక అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న వేళ.. పెట్టుబడిదారులు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
Read Also: Yoon Suk Yeol: దక్షిణకొరియా మాజీ దేశాధ్యక్షుడికి యావర్జీవ కారాగార శిక్ష

US: What is America going to do about the rise in gold prices?
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఇదే సమయంలో.. అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన Federal Reserve భవిష్యత్ వడ్డీ రేటు విధానంపై మార్కెట్లు అంచనా వేస్తుండటంతో.. గురువారం Gold ధరలు మరింత పెరిగాయి. మునుపటి సెషన్లోనే 2 శాతానికి పైగా లాభపడిన బంగారం.. తాజా సెషన్లో కూడా తన ఎగబాకే ప్రయాణాన్ని కొనసాగించింది. ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి ఔన్సుకు 5,031.20 డాలర్లకి చేరుకున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ సంభావ్యత వార్తలు.. బంగారాన్ని ఒక సురక్షిత పెట్టుబడి (సేఫ్ హావెన్)గా మరింత బలపరిచాయి. మార్కెట్ విశ్లేషకుడు జామీ దత్తా మాట్లాడుతూ.. ఇరాన్పై అమెరికా సైనిక చర్య తీసుకుంటే అది కొన్ని రోజుల్లో ముగిసేది కాదని, వారాలపాటు కొనసాగే అవకాశముందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కారణంగా భౌగోళిక రాజకీయ ఆందోళనలు ప్రస్తుతం మార్కెట్లను నడిపిస్తున్న ప్రధాన అంశంగా మారాయని వ్యాఖ్యానించారు. బంగారం, వెండి ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. స్టాప్ లాస్ ఈ స్ఠాయి వద్దే ఉండాలంటున్న నిపుణులు ఈ వారం జెనీవాలో జరిగిన ఇరాన్తో చర్చల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ.
భవిష్యత్ దిశపై భిన్నాభిప్రాయాలు
ఈ నేపథ్యంలో, ఇరాన్ పరిణామాలపై చర్చించేందుకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్లో సమావేశమయ్యారు. మార్చి మధ్య నాటికి ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికా సైనిక దళాల అమరికపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఫెడరల్ రిజర్వ్ జనవరి సమావేశ మినిట్స్ వెలువడ్డాయి. వాటి ప్రకారం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంపై ఫెడ్ సభ్యుల్లో పెద్దగా విభేదాలు లేకపోయినా, భవిష్యత్ దిశపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ద్రవ్యోల్బణం మరింత పెరిగితే అదనపు వడ్డీ రేటు పెంపులకు సిద్ధంగా ఉన్నామని అనేక మంది సభ్యులు పేర్కొనగా.. ద్రవ్యోల్బణం తగ్గితే వడ్డీ రేట్ల కోతలకు మద్దతు ఇవ్వాలని కొంతమంది అభిప్రాయపడ్డారు. వచ్చే రోజుల్లో విడుదల కానున్న వారపు నిరుద్యోగ భత్యాల డేటా.. అలాగే ఫెడ్ అత్యంత ప్రాముఖ్యతనిచ్చే వ్యక్తిగత వినియోగ వ్యయాల (PCE) నివేదిక, కేంద్ర బ్యాంక్ విధాన మార్గంపై మరింత స్పష్టతనివ్వనున్నాయి. CME FedWatch Tool ప్రకారం.. మార్కెట్లు ప్రస్తుతం ఈ ఏడాది మొదటి వడ్డీ రేటు కోత జూన్ నెలలో ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: