हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Trade: అమెరికాతో వాణిజ్య సమరంలోనూ వెనక్కి తగ్గేది లేదు : మోదీ

Anusha
Trade: అమెరికాతో వాణిజ్య సమరంలోనూ వెనక్కి తగ్గేది లేదు : మోదీ

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా ప్రతీకార సుంకాలను ట్రంప్ విధించారు. ఇక అమెరికా-చైనా మధ్య జరిగిన సుంకాలు, ప్రతీకార సుంకాలు తారస్థాయికి చేరుకోవడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతీకార సుంకాలు విధిస్తున్న అమెరికాకే భారత్ బిగ్ షాక్ ఇచ్చింది.పాకిస్తాన్తో యుద్ధంలోనే కాదు, అమెరికాతో వాణిజ్య సమరంలోనూ వెనక్కి తగ్గేది లేదని మరో మారు తేల్చి చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.కొన్ని అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాణిజ్య సంస్థ) డబ్ల్యూటీఓకు భారత్ తాజాగా తెలియజేసింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేకమైన అమెరికా ఉత్పత్తులకు అందిస్తున్న రాయితీలను నిలిపివేయడంతోపాటు దిగుమతి సుంకాలను పెంచాలని నిర్ణయించినట్లు భారత్ తెలిపింది.

 Trade:  అమెరికాతో వాణిజ్య సమరంలోనూ వెనక్కి తగ్గేది లేదు : మోదీ
అమెరికాతో వాణిజ్య సమరంలోనూ వెనక్కి తగ్గేది లేదు : మోదీ

ఉద్రిక్తత

అమెరికా విధించిన టారిఫ్‌ల కారణంగా సుమారు 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుందని కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టారిఫ్‌ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని గతంలోనే భారత్ తప్పుబట్టింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించారు. ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ రంగంపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని డబ్ల్యూటీవో(WTO) వద్ద భారత్ గట్టిగా లేవనెత్తడంతో రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.భారత్, అమెరికా ఒక కొత్త వాణిజ్య ఒప్పందానికి దగ్గరికి వచ్చిన తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించడానికి భారత్ అనేక రాయితీలను అందించినట్లు తెలుస్తోంది. వాటి భవిష్యత్ ఏంటి అనేది ముందు ముందు బయటపడనుంది.

Read Also : Sports: కోహ్లీ ఓ అద్భుతమైన ఆటగాడు: సచిన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870