हिन्दी | Epaper

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి వెలుగులోకి సంచలన నిజాలు!

Anusha
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి వెలుగులోకి సంచలన నిజాలు!

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ సైన్యం హస్తం ఉందన్నట్లుగా కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల్లో ఉన్న ఒక వ్యక్తి ఒకప్పటి పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యేక దళాల్లో పారా కమాండర్‌గా ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడే ఒకప్పటి పాక్ పారా కమాండో హషీమ్ మూసా అని తెలుస్తోంది. ఇక దాడి తర్వాత ఉగ్రవాదులు తప్పించుకున్న విధానాన్ని బట్టి చూస్తే వారికి హై లెవల్ ట్రైనింగ్, స్కిల్స్ ఉన్నాయని భద్రతా బలగాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం పహల్గామ్‌లో మారణహోమం సృష్టించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో హషీమ్ మూసా ఒకడని భావిస్తున్నారు.

అత్యాధునిక

పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు అత్యాధునిక ఎం 4 రైఫిల్స్‌ను ఉపయోగించడం కూడా ఈ అనుమానాలకు మరింత బలం చేస్తున్నాయి. వారికి హషీమ్ మూసా ట్రైనింగ్ ఇచ్చారనే అనుమానాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి అత్యాధునిక ఆయుధాలను వినియోగించేందుకు ఉగ్రవాదులకు ప్రత్యేక శిక్షణ అవసరమని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హషీమ్ మూసా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తున్న ఒక కరుడుగట్టిన ఉగ్రవాది అని తెలుస్తోంది. భారత్‌లోని భద్రతా దళాలు, పౌరులపై దాడులు చేయడానికి లష్కరే తోయిబా సంస్థ అతడిని జమ్మూ కాశ్మీర్‌కు పంపించిందని పలు నివేదికలు చెబుతున్నాయి.

చర్యలు

అయితే ఈ పహల్గామ్ ఉగ్రదాడి మాత్రమే కాకుండా గతంలో కాశ్మీర్‌లో జరిగిన 3 కీలక దాడుల్లో కూడా హషీమ్ మూసా సూత్రధారిగా ఉన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అతడి వ్యూహాత్మక ఆలోచనలు, ఆయుధ శిక్షణ అతడిని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మార్చాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా అతడిని కనిపెట్టాలని భద్రతా దళాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం హషీమ్ మూసా కదలికలపై గట్టి నిఘాను ఉంచాయి. అతడిని పట్టుకోవడం ద్వారా కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో కాశ్మీర్ ప్రాంతంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులు, అందులోనూ పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Read Also :Khawaja Asif: పాక్ రక్షణ మంత్రి ఎక్స్ అకౌంట్ ను నిలిపివేసిన ఇండియా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు
0:32

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

హార్ముజ్ జలసంధిపై చైనా సంచలన ప్రక్రియ.. ట్రంప్ ప్రతిపాదనకు షాక్!

హార్ముజ్ జలసంధిపై చైనా సంచలన ప్రక్రియ.. ట్రంప్ ప్రతిపాదనకు షాక్!

టెహ్రాన్, లెబనాన్‌లపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ .. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు!

టెహ్రాన్, లెబనాన్‌లపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ .. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870