పఠాన్కోట్ సెక్టార్ (Pathankot Sector)లో పాకిస్థాన్కు చెందిన రెండు ఫైటర్ జెట్ల (Fighter Jets)ను భారత సైన్యం కూల్చి వేసింది. ఇందులో ఎఫ్-16 (F-16)యుద్ధ విమానం కూడా ఉంది. అంతేకాదు ఈ ఎఫ్-16 పైలట్ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. జలంధర్(Jalandhar)లో పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది.
పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్పై దాడికి పాక్ యత్నం
ఆపరేషన్ సిందూర్ తరువాత పాక్, భారత సరిహద్దు రాష్ట్రాల్లోని జనావాసాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అంతేకాదు పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్పై దాడికి యత్నించింది. మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. మొత్తంగా చూసుకుంటే హమాస్ తరహా దాడులకు పాక్ విఫలయత్నం చేసింది. అయితే పాక్ దాడులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంది. పాక్కు చెందిన 8 మిసైళ్లను, డ్రోన్లను, 2 ఫైటర్ జెట్లను కూల్చేసింది. అంతేకాదు పాకిస్థాన్లోని సర్గోధా, ఫైసలాబాద్లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా భారత వాయుసేన కూల్చేసింది.

పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న మోదీ
పాకిస్థాన్ దాడులు చేపట్టిన నేపథ్యంలో, జరుగుతున్న పరిణామాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. మరోవైపు త్రివిధ దళాధిపతులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరోవైపు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో పరిస్థితులను సమీక్షించారు.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
పాక్ ఉగ్రవాదుల తరహాలో దాడులు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని విమానయాన శాఖ సూచించింది. విమానాశ్రయ టెర్మినల్ భవనాల్లో సందర్శకులను అనుమతించవద్దని నిర్దేశించింది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండాలని సూచించింది.
జమ్మూకశ్మీర్ లక్ష్యంగా పాక్ దాడులు
జమ్మూకశ్మీర్ లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది. ముఖ్యంగా జమ్మూలోని విమాశ్రయమే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది. భిష్ణా, ఆర్ఎస్ పురా, సాంబా, పూంచ్, కథువా ప్రాంతాల్లో షెల్లింగ్ దాడులు చేసింది. అయితే ఈ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా అఖ్నూర్, కిష్త్వార్, సాంబా, ఉధంపూర్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు చేసింది. రాజస్థాన్లోని జైసల్మీర్లో పాక్ డ్రోన్ దాడులు చేయగా, వాటనిని భారత సైన్యం కూల్చేసింది. మరోవైపు రాజస్థాన్లోని జైసల్మీర్, బికనేర్ సహా పలుప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. పంజాబ్లోని అమృత్సర్, జలంధర్, పఠాన్కోట్ సహా పలు ప్రాంతాల్లో (బ్లాక్అవుట్) విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాక్ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు పారామిలటరీ బలగాలను పంజాబ్కు తరలిస్తున్నారు.
Read Also: India Pakistan War: భారత్-పాకిస్తాన్ యుద్ధం: తాజా పరిణామాలు