పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముదురుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమితో తలపడుతున్న ఇరాన్, తాజాగా గల్ఫ్ దేశాలకు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్కు చెందిన శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రతినిధులు మాట్లాడుతూ, ఒకవేళ ఇరాన్లోని ఇంధన వనరులు, మౌలిక సదుపాయాలు లేదా ఓడరేవులపై చిన్నపాటి దాడి జరిగినా దాని పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం ఇజ్రాయెల్ను మాత్రమే కాకుండా, వారికి సహకరించే లేదా తమపై దాడులకు వేదికగా నిలిచే ఏ గల్ఫ్ దేశాన్ని వదిలిపెట్టబోమని ఇరాన్ నేరుగా హెచ్చరించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Read Also : Allu Cinemas Launch: లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్
ఒకవేళ యుద్ధం గనుక తీవ్రరూపం దాల్చితే, పశ్చిమాసియాలోని అన్ని చమురు మరియు సహజ వాయువు క్షేత్రాలను (Oil & Gas Infrastructure) తగలబెడతామని, ఆ ప్రాంతంలోని ఇంధన సరఫరా వ్యవస్థను సర్వనాశనం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇది జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ యొక్క ఈ “స్ట్రాంగ్ వార్నింగ్” గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలను రక్షణపరంగా పునరాలోచనలో పడేసింది. ఈ హెచ్చరికలతో గల్ఫ్ రీజియన్లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి, ఏ క్షణంలోనైనా పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :