కరోనా(Corona) రీఎంట్రీ కలకలం రేపుతోంది. అది కొత్త రూపంలో పంజా విసురుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటు భారత్(India) పాటు అమెరికా(America)లో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో కరోనా ధాటికి గత వారం రోజుల్లో వందలాది మందిని ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పరిస్థితి మునుపటిలా దారుణంగా లేనప్పటికీ, కరోనా పూర్తిగా పోలేదని ఖచ్చితంగా స్పష్టమైంది. గత కొన్ని వారాలుగా మన దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కరోనా కేసులు నమోదవుతున్నాయి.

దేశవ్యాప్తంగా వందలాది కరోనా కేసులు
కొవిడ్-19 మళ్లీ డేంజర్బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా వందలాది కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో 430కి పెరిగిన యాక్టివ్ కేసులు. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83.. తమిళనాడులో 69, కర్నాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బెంగాల్లో 11 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండగా.. నోయిడాలో 9 కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. గణాంకాలే కాదు, కరోనా మరణాలు కూడా మరోసారి భయాన్ని పెంచాయి. ఇప్పటివరకు 7 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి మరణానికి కారణం కరోనా లేదా మరేదైనా వ్యాధి కాదా అనేది స్పష్టంగా లేదు.
థాయిలాండ్లో కొత్త కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ముందు జాగ్రత్తగా ఆస్పత్రులు సిద్ధం చేయాలని ఆదేశించింది. అయితే.. ఆయా రాష్ట్రాల్లోని కరోనా బాధితులకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. బాధితుల్లో ఎక్కువమంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. భయపడాల్సిన అవసరం లేదని సూచించింది. అదేవిధంగా, థాయిలాండ్లో పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు కనిపిస్తోంది, ఇక్కడ కేవలం ఒక వారంలోనే 50 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Read Also: ASEAN: అమెరికా సుంకాల ప్రభావం మధ్య చైనా త్రిముఖ శిఖరాగ్ర సమావేశం