हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Earthquake: పపువా న్యూ గునియాలో మరోసారి భారీ భూకంపం

Anusha
Earthquake: పపువా న్యూ గునియాలో మరోసారి భారీ భూకంపం

ద్వీప దేశమైన పపువా న్యూ గినియా మరోసారి ప్రకృతి విపత్తుకు గురైంది. శనివారం అక్కడ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్ జిఎస్ ) వెల్లడించింది. కోకోపో పట్టణానికి ఆగ్నేయంగా 115 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 72 కిలోమీటర్ల (44 మైళ్ల) లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం అక్కడ సునామీ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.

ఇది రెండోసారి

భూకంపం సంభవించడం పపువా న్యూ గునియాలో వారంలో ఇది రెండోసారి. గత వారం సరిగ్గా ఇదే రోజు అంటే శనివారం పశ్చిమ న్యూ బ్రిటన్‌ ప్రావిన్స్‌ లో భూమి కంపించింది. కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీంతో అప్పుడు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి . ఇలా వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

హెచ్చరికలు జారీ

ప్రకృతి విపత్తుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందన్న దానికి ఉదాహరణగా,మయన్మార్‌, థాయ్‌లాండ్‌ దేశాల్లో సంభవించిన భూకంపాలను చెప్పుకోవచ్చు.గత నెల 28న మయన్మార్‌లో నిమిషాల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు 7.7, 6.3 తీవ్రతతో సంభవించాయి.తక్కువ వ్యవధిలో థాయ్‌లాండ్‌ను కూడా 6.4 తీవ్రతతో భూకంపం కుదిపింది.ఈ విధ్వంసకర ఘటనల్లో మయన్మార్‌ దేశంలో 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 4 వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. వందలాది మంది గల్లంతయ్యారు.ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.ప్రస్తుతం పపువా న్యూ గినియాలోని ప్రజలు తీవ్ర భయాందోళనతో ఉండగా, అధికారులు సునామీ అవకాశాలను పరిగణలోకి తీసుకొని అలర్ట్‌ స్థాయిని పెంచారు.తీర ప్రాంతాలవాసులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతం భూకంపాలకు ఎక్కువగా లోనయ్యే పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో భాగమవడంతో ఇటువంటి ప్రకృతి విపత్తులు తరచూ చోటు చేసుకుంటుంటాయి.మయన్మార్, థాయ్‌లాండ్‌లలో సంభవించిన భూకంపం ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమైంది. కేవలం నిమిషాల వ్యవధిలో సంభవించిన ఈ భూకంపాలు రెండు దేశాలను తీవ్రంగా కుదిపేశాయి. మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో భూమి భీకరంగా కంపించడంతో భవనాలు నేలకొరిగాయి. 

Read Also: Donald Trump: ట్రంప్‌ను చంపేస్తాం:షాన్ మోన్పర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870