భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న వేళ, ప్రపంచదేశాలు ఈ యుద్ధం ఆపాలని, రెండు దేశాల మధ్య చర్చలు జరపాలని స్పష్టంగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా, ఐరాన్, చైనా వంటి దేశాలు, యుద్ధం ఆపటానికి మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ క్రమంలో అమెరికా కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది.
అంతర్జాతీయంగా పలుదేశాలు పాక్ కు కాల్
భారత్ పాక్ యుద్ధం అమెరికా వైఖరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఇవాళ కౌంటర్ ఆపరేషన్ బున్యన్ ఉల్ మర్సూస్ ను చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన పరిస్థితుల నేపధ్యంలో పలువురు ఈ యుద్ధం వద్దని జోక్యం చేసుకోవటానికి, చర్చలకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం కోసం అంతర్జాతీయంగా పలుదేశాలు ముందుకొస్తున్నాయి. వీటిలో ఇరాన్, చైనా ఉండగా, యుద్ధం వద్దని చర్చలు జరపాలని అమెరికా సైతం కోరుతుంది.
అమెరికా మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో ఫోన్ కాల్
పాక్ ఆర్మీచీఫ్కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్ చేశారు. పాక్ ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఇరుదేశాల మధ్య చర్చల అవసరం పై దృష్టి పెట్టాలని మార్కో రూబియో ఆదేశాలు ఇచ్చారు.
జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు
శాంతి కాంక్ష ఇక ఇటీవల భారత్ పాక్ మధ్య యుద్ధంలో తాము జోక్యం చేసుకోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తేల్చి చెప్పారు. రెండు అణు శక్తి దేశాలు ఘర్షణ పడుతూ భారీ సంక్షోభం వైపు రావడం పైన తాము ఆందోళన చెందుతున్నమని ఆయన పేర్కొన్నారు. వీలైనంత తొందరగా పరిస్థితులు శాంతి దిశగా కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరోమారు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి చర్చల అవసరం ఉందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు తేల్చి చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్యలు యుద్ధం మరింత తీవ్రతకు చేరుకునే అవకాశాన్ని కట్టిపడేసే దిశగా ఉంటాయని వెల్లడించారు.
విమానాశ్రయాల మూసివేత
భారత్ పాక్ ఉద్రిక్తతలతో ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాల్లోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ సమయంలో, ఢిల్లీ విమానాశ్రయం కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఎయిర్పోర్టు అధికారులు ప్రకటించారు. ఇలా, భద్రతా ఉత్కంఠ నేపథ్యంలో విమానాలు సకాలంలో ఆగిపోవడం, ప్రయాణికుల రవాణా నిర్వాహణకు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోవడంతో, ఈ యుద్ధం ప్రపంచ భద్రతకు తీవ్రమైన సవాల్గా మారవచ్చు.
Read also: Ishaq Dar: భారత్ ఇక్కడ ఆగిపోతే మేము కూడా ఆగిపోతాం: పాక్ విదేశాంగ శాఖ మంత్రి