हिन्दी | Epaper

America: భారతీయ విద్యార్థులకు యూఎస్ ఎంబసీ వార్నింగ్

Saritha
America: భారతీయ విద్యార్థులకు యూఎస్ ఎంబసీ వార్నింగ్

అమెరికా అంటేనే ఉద్యోగులు, విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలో వచ్చిన నాటి నుంచి వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను బలవంతంగా స్వదేశాలకు పంపుతున్నారు. (America) తాజాగా స్టూడెంట్ వీసాలపై అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు అమెరికన్ ఎంబసీ వార్నింగ్ తో కూడిన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా వీసా అనేది ఎవరికైనా స్వయంగా లభించే హక్కు కాదని, అది పూర్తిగా ఒక ప్రత్యేక గౌరవం మాత్రమేనని స్పష్టం చేసింది. స్టూడెంట్ వీసా పొందిన విద్యార్థులు అమెరికా చట్టాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని, వాటిని ఉల్లంఘిస్తే ఎలాంటి సడలింపులు ఉండవని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. స్టూడెంట్ వీసాతో అమెరికాలో ఉన్న విద్యార్థులు స్థానిక చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంబసీ స్పష్టంగా పేర్కొంది.

Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు

America: భారతీయ విద్యార్థులకు యూఎస్ ఎంబసీ వార్నింగ్

తక్షణమే వీసా రద్దు

అమెరికా (America) చట్టాల ఉల్లంఘన జరిగితే వీసాను తక్షణమే రద్దు చేయడం, విద్యార్థులను బలవంతంగా విదేశాలకు పంపించడం వంటి చర్యలు తీసుకుంటామని తెలిసింది. అంతేకాదు, కొంతకాలం పాటు అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేయకుండా, బ్లాక్ లిస్ట్లో ఉంచడం, తీవ్రమైన సందర్భాల్లో అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశమూ ఉందని తెలిపింది. అధికారిక ప్రకటన చేసిన అమెరికా ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

భారతీయ విద్యార్థులు మాత్రమే కాకుండా, అమెరికాలో ఉన్న అన్ని విదేశీయులు అక్కడి చట్టాలను గౌరవిస్తూ వ్యవహరించాలని ప్రకటనలో సూచించింది. విద్యా, ఉద్యోగం లేదా ఇతర కారణాలతో అమెరికా వెళ్లిన వారంతా తమ వీసా షరతులు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పూర్తిగా తెలుసుకుని పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో స్టూడెంట్ వీసాలకే కాకుండా వర్కింగ్ వీసాలు, టూరిస్ట్ వీసాలు, బిజినెస్ వీసాల మంజూరులో కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకున విద్యార్థులు కేవలం చదువుపై మాత్రమే కాకుండా, అక్కడి చట్టాలు, నిబంధనలపై సమానంగా దృష్టి పెట్టాలని భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

📢 For Advertisement Booking: 98481 12870