గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నగర వ్యాప్తంగా ఆస్తి పన్ను ఎగవేతపై గట్టి చర్యలకు సిద్ధమైంది. తమ ఆస్తుల విలువను తక్కువగా చూపించి పన్ను తగ్గించి చెల్లిస్తున్న భవన యజమానులపై బల్దియా దృష్టి సారించింది. తాజా GIS ఆధారిత సర్వేలో లక్షకు పైగా యజమానులు పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఎగవేత మొత్తం రూ.100 కోట్లకు మించినట్లు అంచనా వేయబడింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28 వరకే స్వచ్ఛందంగా పన్ను సవరించుకునే అవకాశం ఇచ్చారు.
Read also: HYD Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

GHMC has issued important warnings to them
GIS సర్వేలో బయటపడిన ఆస్తి పన్ను అక్రమాలు
2024 ఆగస్టు నుంచి 2025 డిసెంబర్ వరకు నిర్వహించిన GIS సర్వేలో డ్రోన్ చిత్రాలు, హై రిజల్యూషన్ మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ సర్వేలో నగర పరిధిలోని ఆరు లక్షలకుపైగా ఆస్తులను పరిశీలించారు. అనుమతించిన విస్తీర్ణం కంటే ఎక్కువగా భవనాలను వినియోగిస్తున్నట్లు, అలాగే కమర్షియల్ స్పేస్ను తక్కువగా చూపించి పన్ను తగ్గిస్తున్నట్లు గుర్తించారు. కొందరు బిల్ కలెక్టర్ల సహకారంతో తప్పుడు లెక్కలు చూపిన సందర్భాలు కూడా బయటపడ్డాయి.
ఫిబ్రవరి 28 తర్వాత కఠిన చర్యలు
GHMC కమిషనర్ కర్ణన్ ఆదేశాల మేరకు మార్చి 1 నుంచి కఠిన చర్యలు అమలు చేయనున్నారు. పన్ను సవరించుకోని యజమానులకు భారీ జరిమానాలు విధించడంతో పాటు నేరుగా ఇళ్లకు వెళ్లి నోటీసులు జారీ చేయనున్నారు. ముఖ్యంగా కమర్షియల్ భవనాలు, ట్రేడ్ లైసెన్స్ ఉన్న ఆస్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఆలస్యం చేస్తే ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా సమస్యకు పరిష్కారం
నోటీసుల కోసం ఎదురుచూడకుండా భవన యజమానులే స్వచ్ఛందంగా తమ ఆస్తి వివరాలను సరిచేసుకోవాలని GHMC సూచిస్తోంది. ఇందుకోసం GHMC అధికారిక ఆన్లైన్ పోర్టల్లో ‘Self Assessment’ ఆప్షన్ను అందుబాటులో ఉంచారు. సరైన విస్తీర్ణం, వినియోగ వివరాలతో పన్ను చెల్లిస్తే జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి సడలింపులు ఉండవని బల్దియా స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: