భారతదేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు అనేది ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు. దీని ముఖ్య ఉద్దేశం దేశంలోని ప్రధాన నగరాలను హై-స్పీడ్ రైళ్ల ద్వారా అనుసంధానం చేయడం. దీని ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది.ప్రస్తుతం భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ముంబై-అహ్మదాబాద్ కారిడార్ నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టు జపాన్ సాంకేతిక సహకారంతో నిర్మించబడుతోంది. ఈ నేపథ్యంలో, దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు నెట్వర్క్ ను విస్తరించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు , హైదరాబాద్-చెన్నై నగరాల మధ్య కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను నిర్మించాలని నిర్ణయించారు. బుల్లెట్ ట్రైన్ నెట్ వర్క్ ల ద్వారా దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించే బృహత్తర కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్-ముంబై హై-స్పీడ్ రైలు కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ కారిడార్ 709 కిలోమీటర్ల పొడవుతో ముంబై , హైదరాబాద్ నగరాలను కలుపుతుంది. దీనిని బెంగళూరు వరకు పొడిగించే యోచనలో కూడా అధికారులు ఉన్నారు.

ఈ మార్గం 618 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సుమారు 11 గంటలు, వందే భారత్ ఎక్స్ప్రెస్ లో 8.5 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు రాకతో ఈ ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గుతుందని భావిస్తున్నారు.ఈ మార్గం 757 కిలోమీటర్లు. ప్రస్తుతం సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లకు 15 గంటలు పట్టే ఈ ప్రయాణం బుల్లెట్ రైలుతో కేవలం 2.5 గంటలకు తగ్గుతుంది. ఈ మూడు మార్గాలలో ఎలివేటెడ్ మరియు అండర్ గ్రౌండ్ ట్రాక్ ల కలయికతో రైల్వే లైన్లను నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి 10 నుండి 13 సంవత్సరాలు పట్టవచ్చని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.