SC, ST case against Infosys co founder Chris Gopalakrishna

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు

బెంగళూరు : ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం సహా మరో 16 మందిపై బెంగళూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే వీరందరిపై కేసు పెట్టింది.. మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప అని పోలీసులు తాజాగా వెల్లడించారు.

2014లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్సీ)లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దుర్గప్పను.. అప్పటి యాజమాన్యం విధుల్లోంచి తొలగించింది. ముఖ్యంగా అతడు ఓ హనీ ట్రాప్ కేసులో ఇరుక్కోగా.. అప్పటి ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం.. బోవి వర్గానికి చెందిన దుర్గప్పను ఉద్యోగంలోంచి తీసేశారు. అయితే తాను నిర్దోషిని అని కావాలనే ఐఐఎస్సీ యాజమాన్యం సహా మరికొందరు తనపై కక్ష్య గట్టారని అప్పుడే దుర్గప్ప చెప్పుకొచ్చారు. కానీ అప్పట్లో అతడి మాటలు ఎవరూ వినలేదు.

image
image

ఇంతకాలం చడీ చప్పుడు లేకుండా ఉన్న ఐఐఎస్సీ మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప తాజాగా వీరందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఐఐఎస్ మాజీ డైరెక్టర్ బలరాంలతో పాటు అక్కడే పని చేసే ప్రొఫెసర్లు.. గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వర్, హరి కేవీఎస్, దానప్ప, బలరామ్ పి, హేమలతా మిషి, ఛటోపాధ్యాక కే, ప్రదీప్ డి సావ్కార్, మనోహరన్ తదితరులు ఉన్నారు.

Related Posts
ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేవారికి అలర్ట్
Free gas cylinder guarantee scheme to be implemented in AP from today

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దీపం-2’ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ బుక్ చేసుకోని లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా తమ మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలని Read more

భారతీయులకు జో బైడెన్ శుభవార్త
visa

ట్రంప్ ఎన్నికలో గెలిచి, జనవరిలో కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న తరుణంలో వీసాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆందోనళ చెందే వారికీ జో బైడెన్ Read more

నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం
Vaikunta Mahadwaram

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. గత పది రోజులుగా భక్తుల తాకిడితో తిరుమలలో విశేషమైన రద్దీ నెలకొంది. టీటీడీ (తిరుమల Read more

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
stock market

భారత స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కొనుగోళ్ల అండతో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఇయర్ ఎండింగ్ లో వరుస నష్టాలకు Read more