ఇటీవల మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఊహించని ట్విస్టులు, ఇంటెన్స్ సస్పెన్స్, భిన్నమైన కథలతో థ్రిల్లర్ చిత్రాలు ప్రేక్షకుల్ని థియేటర్ ఓటీటీ వేదికలవైపు మరింత ఆకర్షిస్తున్నాయి. అలాంటి కథాంశంతో 2025లో విడుదలైన తాజా చిత్రం ‘దేవా’ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల్ని అలరిస్తూనే, చివర్లో ఊహించని ట్విస్ట్తో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఇందులో షాహిద్ కపూర్ (Shahid Kapoor) ప్రధాన పాత్ర పోషించారు, అలాగే పూజా హెగ్డే కథానాయికగా కనిపించింది. ఆయనతో పాటు, పావైల్ గులాటి, కుబ్రా సైట్, ప్రవేశ్ రాణా వంటి తారలు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ పోలీస్ ఆఫీసర్ దేవ్ పాత్రను పోషించారు.
కథేంటంటే
ఈ సినిమా కథ మొత్తం దేవ్ చుట్టూ తిరుగుతుంది. అతను ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. పని విషయంలో అతను ఎవరి మాట వినడు. అతిపెద్ద గూండాలు, నేరస్థులు కూడా దేవ్ కి భయపడతారు. ఈ చిత్రంలో పావైల్ గులాటి (Pavail Gulati) ACP రోహన్ డి’సిల్వా పాత్రను పోషించారు. అయితే దేవా, రోహన్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. పోలీసుల కోసం నిర్వహించిన ఓ వేడుకలో రోహన్ హత్యకు గురవుతాడు. దీంతో కథ మలుపు తిరుగుతుంది. రోహన్ హత్య కేసును దర్యాప్తు ప్రారంభించి, హంతకుడిని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు దేవా. అప్పుడే ఓ ప్రమాదంలో చిక్కుకుని జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో సినిమా కథ మొత్తం తలక్రిందులవుతుంది.

అద్భుతమైన నటన
సినిమా చివరి వరకు విలన్ ఎవరనేది అర్థం కాదు. కానీ క్లైమాక్స్లో ఎవరూ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఈ చిత్రంలో మరోసారి అద్భుతమైన నటనతో జనాలను మెప్పించారు షాహిద్ కపూర్. ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ (Roshan Andrews) దర్శకత్వం వహించారు. రూ. 60 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 56.12 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ప్లిక్స్ (Netflix) ఓటీటీలో దూసుకుపోతుంది.
Read Also: Salman Khan : కపిల్ శర్మ షోలో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు