ఉత్తర్ప్రదేశ్(Uttarapradesh)లోని అలీగఢ్(Aligud)లో దారుణ ఘటన వెలుగు చూసింది. పోలీస్స్టేషన్లోని మెస్లో ఓ మహిళపై కుక్ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అసభ్యకరమైన వీడియోలు తీసి కొంతకాలంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కాంట్రాక్ట్పై నియమించిన అతడిని పని నుంచి తీసేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, సదరు మహిళకు ఇప్పటికే వివాహమైంది. పిల్లలు కూడా ఉన్నారు. అటాచుంగి ప్రాంతానికి చెందిన ముకేశ్ను పోలీస్ స్టేషన్ మెస్లో వంటమనిషిగా నియమితులయ్యాడు. అయితే వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఓసారి బాధితురాలు మేకలు మేపుతున్నప్పుడు, అనుకోకుండా ఒకటి పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది. దీంతో ఆమె మేకను తీసుకురావడానికి లోపలకు వెళ్లింది.

ఫొటోలు, వీడియోలతో బెదిరింపులు
అప్పుడు స్టేషన్లో ఎవరూ లేకపోవడంతో ముకేశ్ ఆమెపై కన్నేశాడు. మెస్లోనికి తీసుకెళ్లి బాధితురాలిపై అత్యాచారం చేశాడు. అప్పుడు ఫొటోలు, వీడియోలు తీశాడు. ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ముకేశ్ 4 నెలలుగా బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. తనను కలవమని బలవంతం చేసేవాడు.
ఒకవేళ రానని చెబితే పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. అయితే మే 22వ తేదీ రాత్రి ముకేశ్ గోడ దూకి బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పుడు ఆమె గట్టిగా అరవడంతో అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. ముకేశ్ను పట్టుకోవడానికి ప్రయత్నించగా, ఆమెను బెదిరించి పారిపోయాడు. ఆ తర్వాత నిందితుడు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
మహిళ వాంగ్మూలం ఆధారంగా కేసులో చర్యలు
దీంతో మే 23న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, కానీ పోలీసులు వినలేదని బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత ఆమె కుటుంబం జాన్సున్వై పోర్టల్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు ముకేశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రూరల్ అమృత్ జైన్ తెలిపారు. అతడిని కాంట్రాక్ట్పై పోస్ట్ చేశారని, ఇప్పుడు తొలగించినట్లు చెప్పారు. బాధితురాలి ఇంట్లో ఘటన జరగ్గా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళ వాంగ్మూలం ఆధారంగా కేసులో చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: Nagar Kurnool: భార్య ప్రశ్నించిందని హతమార్చిన భర్త