అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఒక్కసారిగా అనేక కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది.మూడు రోజుల క్రితం జరిగిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి (Former CM) విజయ్ రూపానీ (Vijay Rupani) మృతదేహాన్ని గుర్తించారు. రూపానీ రక్తసంబంధీకుల డీఎన్ఏ (DNA) తో ఘటనా స్థలంలో సేకరించిన శరీర భాగాల డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 11.10 గంటలకు డీఎన్ఏ టెస్టుకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి.
ప్రభుత్వ లాంఛనాలతో
విజయ్ రూపానీ మృతదేహం గుర్తించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. రాజ్కోట్ (Rajkot) లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా గత గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం కొన్ని సెకన్లలోనే కుప్పకూలింది.ఈ ప్రమాదంలో విజయ్ రూపానీతోపాటు ఆ విమానంలో ఉన్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు. రమేశ్ విశ్వాస్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే గాయాలతో బయటపడ్డారు.

ఒక్క వ్యక్తి
అదేవిధంగా విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ (Medical College Hostel) పై పడటంతో అందులోని పలువురు వైద్యులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిలో కూడా పరిస్థితి విషమించి కొందరు ప్రాణాలు కోల్పోయారు. దాంతో బీజే హాస్టల్ మృతుల సంఖ్య 38కి పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 279కి చేరింది.కాగా,విజయ్ రూపానీ తన భార్య, కుమార్తెను కలిసేందుకు లండన్ (London) వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. వాస్తవానికి, బీజేపీ పంజాబ్ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున, అలాగే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో ఆయన లండన్ ప్రయాణాన్ని గతంలో వాయిదా వేసుకున్నారు,ఆయన 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. విమాన ప్రమాదంలో మరణించిన రెండో గుజరాత్ ముఖ్యమంత్రిగా రూపానీ నిలిచారు. గతంలో 1965లో బల్వంతరాయ్ మెహతా కూడా విమాన ప్రమాదంలోనే కన్నుమూశారు.
Read Also: Uttarakhand: ఉత్తరాఖండ్లో కూలిన హెలికాప్టర్- పలువురు మృతి