
Chevella News: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ప్రాంతంలో ఒక ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ఒక ఆలయ పుష్కరిణిలో గుర్తు తెలియని వ్యక్తి శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: POCSO: విశాఖలో ఘోరం: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం
హత్య చేసి నీళ్లలో పడేసినట్లు అనుమానం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు బాధితుడిని కర్రలతో విచక్షణారహితంగా కొట్టి హత్య చేశారని, ఆపై ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని పుష్కరిణిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్(Clues Team) రంగంలోకి దిగి ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించింది. మృతుడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: