కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)తో సహా వివిధ పార్టీలు బుధవారం బంద్, నిరసనకు పిలుపునిచ్చాయి.దీంతో జమ్మూ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రత్యక్ష సాక్షి
ఫుడ్స్టాల్స్ వద్ద కొందరు, గుర్రాలపై స్వారీ చేస్తూ కొందరు, పచ్చిక బయలుపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరి కొందరు పర్యాటకులు ఉన్న సమయంలో అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్చవద్దని మహిళలు వేడుకుంటున్నా వారు కనికరించలేదు. ఇతను ముస్లిం కాదు.. కాల్చేయండి అని ఓ ఉగ్రవాది అన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భర్తను, ఆప్తులను కోల్పోయిన చాలా మంది మహిళలు సాయం కోసం స్థానికులను అర్థించే దృశ్యాలు వైరల్ అయ్యాయి.ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నందున క్షతగాత్రులను తరలించడానికి సైనిక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. భద్రతా ఏర్పాట్ల మధ్య ఇతర పర్యాటకులను అక్కడి నుంచి అధికారులు తరలించారు.ఉగ్రదాడిపై భారత క్రికెటర్లు స్పందించారు. ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ టీమ్ఇండియా కోచ్, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఎక్స్లో పోస్ట్ చేశారు.
స్పందించిన క్రికెటర్లు
మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా. ఘటనకు సంబంధించిన బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందిస్తుంది” — గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా కోచ్. “కశ్మీర్లో అమాయక పర్యటకులపై జరిగిన దాడి దారుణమైమది. ఆ ఘటన తీవ్రంగా బాధించింది. ఇలాంటి దుఃఖ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా.పర్యాటకులపై ఇటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం మానవాళికి అవమానకరం” — సౌరభ్ గంగూలీ, టీమ్ఇండియా మాజీ ప్లేయర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు.” పవాల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన హృదయాన్ని కలిచివేసింది. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తాను. ఇలాంటి హింసకు మన దేశంలో స్థానం లేదు” — శుభ్మన్ గిల్, క్రికెటర్,” పవాల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తీవ్రంగా బాధించింది. బాధితుల కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా. వారి కోసం మానవత్వంతో ఐక్యంగా నిలబడదాం” — యువరాజ్ సింగ్, మాజీ క్రికెటర్,”కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి విని తీవ్రంగా బాధపడ్డాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి ఆలోచిస్తున్నా. వారు ధైర్యంగా ఉండాలని ప్రారిస్థున్నా” — కెఎల్ రాహుల్, క్రికెటర్,” ఒక అమాయకుడి ప్రాణం కోల్పోయిన ప్రతిసారీ మానవత్వం కోల్పోతుంది.నేను రెండు రోజుత క్రితం అక్కడే ఉన్నాను. ఈ బాధ మరింత దగ్గర అనిపిస్తుంది” — ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్, పవాల్గాంలో అమాయక పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి విని చాలా బాధపడ్డాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడని ప్రార్థిస్తున్నా” — వీరేంద్ర స్వెహాగ్, మాజీ క్రికెటర్.
Read Also: IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పై స్పందించిన రిషబ్ పంత్