Assembly :అసెంబ్లీ కి రాని ఎమ్మెల్యే ల పై రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఆగ్రహం

Assembly :అసెంబ్లీ కి రాని ఎమ్మెల్యే ల పై రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా జీతం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయం పై మాట్లాడారు.

వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు విమర్శలు

అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించేందుకు, పాలనలో పారదర్శకత తీసుకురావడానికే ఏర్పాటు చేయబడతాయి.అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా, కేవలం హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసుకుని వెళ్లిపోవడం ప్రజాస్వామ్యానికి తగదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. “వైసీపీ సభ్యులు కొంత మంది అసెంబ్లీలో కనిపించకుండా రిజిస్టర్‌లో మాత్రం సంతకాలు చేశారు,అని చంద్రబాబు తెలిపారు.గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు రాకపోవడం ప్రజల పక్షాన పని చేయకపోవడమే అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.ధైర్యంగా సభకు రాలేరా? దొంగల్లా వచ్చి సంతకాలు చేయడం ఎందుకు,అని ఆయన వైసీపీ సభ్యులను ప్రశ్నించారు.

కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకుండా, ప్రజల సొమ్ముతో జీతం తీసుకోవడం తగదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ 57 లక్షల జీతం తీసుకుని అసెంబ్లీకి రావడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని విమర్శించారు.ప్రజల సొమ్ము జీతంగా పొందుతున్న కేసీఆర్ అసెంబ్లీకి సమావేశాలకు వచ్చి తెలంగాణ అభివృద్ధికి సలహాలు ఇవ్వకుండా హౌస్‌లో ఉండిపోవడం సమంజసమా అని రేవంత్ ప్రశ్నించారు.

chandrababu revanth reddy 2024 09 e590a2aea8da4a7b35eb040ff1651af3

ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేల హాజరు అవసరమే

ఎమ్మెల్యేలు ప్రజల సేవకులు.ప్రజల కష్టాలు పరిష్కరించడానికి, పాలనలో చురుకుగా పాల్గొనడానికి అసెంబ్లీలో హాజరు కావాల్సిందే.ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడమేంటని రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైసీపీ, బీఆర్ఎస్ సభ్యులు భవిష్యత్‌లోనైనా ఈ తీరును మార్చుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రజా ప్రతినిధుల బాధ్యత

ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు వారుకూడా ఒకవిధంగా ప్రభుత్వ ఉద్యోగులే ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రతి నెలా జీత భత్యాలు తీసుకునే వారు ఎన్నుకున్న ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఎలా,ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం తప్పనిసరి. ప్రజల కట్టే పన్నుల నుంచే వీరు జీతం తీసుకుంటారు, అందుకే సభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలి.

Related Posts
జగన్ భద్రత కోరుతూ మిథున్ రెడ్డి లేఖ
జగన్ భద్రత కోరుతూ మిథున్ రెడ్డి లేఖ

జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వైసీపీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో జరిగిన మిర్చి యార్డు పర్యటనలో భద్రతా వైఫల్యం కనిపించింది. Read more

Sudheer Reddy : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు
Case registered against MLA Sudheer Reddy

Sudheer Reddy : రంగారెడ్డిలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. తనను దూషించారని హస్తినాపురం కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు Read more

హన్మకొండ బీజేపీ ఆఫీస్ లో ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశం
హన్మకొండ బీజేపీ ఆఫీస్ లో ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశం

ఎంపీ డీకే అరుణ కామెంట్స్: దేశ వ్యాప్తంగా భాజపా దూసుకుపోతుంటే కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని క్రమేపీ కోల్పోతుంది. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. Read more

నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu meets Union Ministers today

నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ.రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు.అమరావతి: బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశరాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *