हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Sudheer Reddy : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు

sumalatha chinthakayala
Sudheer Reddy : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు

Sudheer Reddy : రంగారెడ్డిలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. తనను దూషించారని హస్తినాపురం కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రోటోకాల్ విషయంలో చెలరేగిన వివాదం ఇప్పుడు కేసుల వరకు వెళ్లింది. నియోజకవర్గంలోని మున్సురాబాద్‌ పరిధిలో కొన్ని అభివృద్ధి పనులకు సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది స్థానిక కార్పొరేటర్‌ను పిలవకుండా కార్యక్రమం చేపట్టడంపై ఆ స్థానంలో గెలిచిన బీజేపీ కార్పొరేటర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పిలువకుండా ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా చేస్తున్నారని మండిపడ్డారు.

image

బీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల పోటాపోటీ ఆందోళనలు

విమర్శలతో ఆగిపోని మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అనుచరులతో వెళ్లి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శంకుస్థాపన చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన్ని వారి అనుచరులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. శంకుస్థాపన ఏరియాలో బీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల పోటాపోటీ ఆందోళనలు, నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి బీఆర్‌ఎస్ శ్రేణులను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌లో తన అనుచరులు ఉన్నారని తెలుసుకున్న సుధీర్ రెడ్డి హుటాహుటిని పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.

సుజాత నాయక్‌పై ఘాటు వ్యాఖ్యలు

అరెస్టు అయ్యి స్టేషన్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులను పరామర్శించారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు ఆయనపై విమర్సలకు కారణమయ్యాయి. స్టేషన్‌లో ఉన్న అనుచరులతో సమావేశమై వచ్చిన సుధీర్ రెడ్డి… కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, సుజాత నాయక్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుధీర్‌ రెడ్డి తనను దూషించారని ఎల్పీనగర్ పీఎస్‌లో బానోతు సుజాత ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870