టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమాకు ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ అభిమానులు పెరుగుతున్నారేకానీ తరగడంలేదు. తరం మారుతున్నప్పటికీ కొత్తతరంలోని సినీ ప్రియులు కూడా ఈ సినిమాను బాగా ఇష్టపడుతున్నారు. స్టార్ మా టీవీలో ఈ సినిమాను 1500సార్లకు పైగా ప్రసారం చేశారు. ప్రసారం చేసిన ప్రతిసారీ మంచి టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంటోంది. థియేటర్లలో విడుదలైన మొదటి వారం, పదిరోజులు ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. తర్వాత అందరికీ నచ్చింది. ఆరోజుల్లోనే దాదాపు రూ.25 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఫిలింనగర్
ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జయభేరి పతాకంపై మురళీమోహన్ నిర్మించారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అతడును ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ప్రీరిలీజ్ థియేట్రికల్ వ్యాపారం రూ.3.50 కోట్లు జరిగి ఫిలింనగర్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడటంద్వారా అతడు సినిమా రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే థియేట్రికల్ వ్యాపారం జరుగుతుండటం గమనార్హం.

సంచలన
రాబోయే రెండు సంవత్సరాలు మహేష్ బాబు నుంచి ఎటువంటి సినిమా వచ్చే అవకాశం లేకపోవడంతో ఉన్న సినిమాలనే రీరిలీజ్ చేస్తున్నారు. అభిమానులు కూడా దీంతోనే సంతృప్తి పడుతున్నారు. అయితే ఇప్పటివరకు రీరిలీజ్ బిజినెస్ కు సంబంధించి అన్ని సినిమాల రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టబోతోందంటున్నారు. 4కే రిజల్యూషన్ లోకి మార్చి, డాల్బీ అట్మాస్ శబ్దాన్ని అందించడంద్వారా అభిమానులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది. ఏదేశమైనప్పటికీ ఈ సినిమా మొదటిసారి విడుదలైనప్పటికంటే రెండోసారి విడుదలవుతున్న సమయంలోనే భారీ కలెక్షన్లు రాబట్టి సంచలన రికార్డు నెలకొల్పే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
Read Also: OTT: ఓటీటీలోకి ఓదెల 2 మూవీ ఎప్పుడంటే?