
టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్లలో ఒకటైన మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi Movie) పై మరో కీలక అప్డేట్ వెలువడింది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ రాజమౌళి స్వయంగా క్లారిటీనిచ్చాడు. ఈ సినిమాను తొలుత రెండు భాగాలుగా చేయాలని భావించినప్పటికీ, చివరికి దీనిని ఒకే ఒక్క భాగంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also: Mahesh Babu: రాముడి పాత్ర నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్
సుమారు 3 గంటల నిడివి
ఈ సినిమా (Varanasi Movie) కు సీక్వెల్ ఉండదని, సుమారు 3 గంటల నిడివితో సింగిల్ పార్ట్గానే విడుదల కానుందని స్పష్టం చేశారు. రామాయణంలోని ఓ భాగాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలిపారు. కాగా, మహేశ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పృథ్వీరాజ్ విలన్గా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: