టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ “కుబేర (Kuberaa)”తో మరోసారి ప్రేక్షకుల మనసులను గెలవడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విజేత ధనుష్,నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేర. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మల్టీ లింగ్వెల్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి ట్రాన్స్ ఆఫ్ కుబేరా అంటూ టీజర్ను వదిలారు మేకర్స్. నాది నాది నాది అంటూ పాటతో సాగిన ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది.
నేపథ్యంలో
ఈ టీజర్ చూస్తుంటే ”నాది నాది నాది నాదే ఈ లోకమంతా నేల నాది, గింజ నాది, కాలు నాది, కనులు నావి, భూగర్భపు సిరులు నావి కోట నాది, కొలువు నాది, కోరుకున్నదల్లా నాది నాది నాది నాది నాదే ఈ లోకమంతా” అంటూ ఓ బ్యాగ్రౌండ్ సాంగ్ తో ప్రారంభమైన ‘కుబేరా’ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇది ధనవంతులు, పేదవాళ్ళు అధికారం, నైతిక విలువల మధ్య జరిగే సంఘర్షణల నేపథ్యంలో రూపొందిన సోషల్ థ్రిల్లర్ అని అనిపిస్తోంది. ఇందులో ధనవంతుడిగా జిమ్ సార్బ్(Jim Sorb) కనిపిస్తే బిచ్చగాడిగా ధనుష్ కనిపించారు. నాగార్జున ఒక ఆఫీసర్ గా, రష్మిక మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రల్లో ఆకట్టుకున్నారు.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టీజర్లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ హైలైట్గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
Read Also: Kamal Haasan: ‘థగ్ లైఫ్’ వేడుకలో కమల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు