News Telugu: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన తాజా చిత్రం కూలీ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, రజనీ అభిమానులకే కాకుండా మాస్ ఆడియెన్స్ను కూడా ఆకట్టుకుని సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాసింది.

స్టార్ యాక్షన్ ఎంటర్టైనర్
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకాంత్తో పాటు అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్, సత్యరాజ్, రచితా రామ్ వంటి పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ కూడా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, బీజీఎమ్ సినిమాకి మరో స్థాయి హైప్ తెచ్చింది.
థియేటర్లలో హవా కొనసాగుతోంది
విడుదలైన మూడు వారాలు దాటినా ఇంకా చాలా చోట్ల కూలీ సినిమా రన్ అవుతోంది. రజనీ స్టైల్ యాక్షన్, నాగార్జున విలన్ షేడ్స్, అలాగే ఇతర నటీనటుల ప్రదర్శనలు ప్రేక్షకులను థియేటర్లలోకి ఆకర్షిస్తూనే ఉన్నాయి. మాస్ ఫైట్ సీన్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్ వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఓటీటీలోకి కూలీ
థియేటర్లలో విజయం కొనసాగుతూనే, ఇప్పుడు కూలీ సినిమా ఓటీటీలోకి రాబోతోందన్న వార్త సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేపుతోంది. సినిమా థియేటర్లలో విడుదలైన 28 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దాంతో సెప్టెంబర్ 11 నుంచి కూలీ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇది తమిళ్తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రేక్షకుల్లో ఆసక్తి
థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం ఓటీటీలో ఎంత స్పందన పొందుతుందో చూడాలి. ముఖ్యంగా రజనీ యాక్షన్కు థియేటర్లలో దక్కిన రెస్పాన్స్, ఓటీటీలో కూడా అదే ఉత్సాహాన్ని రాబడుతుందా అన్నది ఇప్పుడు ఫ్యాన్స్లో హాట్ టాపిక్గా మారింది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన రానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: