Bollywood Actor: చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్పాల్ యాదవ్ కు ఢిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఫిబ్రవరి 16న ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 9 కోట్ల బకాయిల చెల్లింపులో విఫలమైనందున ఆయన 11 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నారు. మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు మార్చి 18 వరకు ఈ బెయిల్ వర్తిస్తుంది. రూ.1.5 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ డిపాజిట్ చేయడంతో పాటు పాస్పోర్ట్ కోర్టుకు అప్పగించాలనే షరతులు విధించారు.తదుపరి విచారణ మార్చి 18న జరగనుంది.
Read Also: AI: బెంగళూరులో కార్యాలయాన్ని ప్రారంభించిన Anthropic

కేసు నేపథ్యం ఏంటి?
రాజ్పాల్ యాదవ్ 2010లో తన దర్శకత్వ ప్రయత్నం అయిన Ata Pata Laapata కోసం సుమారు రూ.5 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైన తర్వాత రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన జారీ చేసిన చెక్కులు బౌన్స్ కావడంతో, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కింద కేసు నమోదైంది. జరిమానాలు, వడ్డీలు కలిపి మొత్తం బకాయి సుమారు రూ.9 కోట్లకు పెరిగింది. ఫిర్యాదుదారు సంస్థ మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, చెల్లిస్తానని ఇచ్చిన హామీని పలుమార్లు నిలబెట్టుకోకపోవడంతో కోర్టు కఠినంగా వ్యవహరించింది.
కోర్టు వ్యాఖ్యలు
గత వారం బెయిల్ ను, నిరాకరిస్తూ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ వ్యాఖ్యానిస్తూ, కోర్టు ఆదేశాల వల్ల కాదు, ఒప్పంద నిబంధనలు పాటించనందునే ఆయన జైలులో ఉన్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ, తాజాగా ఆయన న్యాయ బృందం కొన్ని షరతులతో బెయిల్ పొందడంలో విజయవంతమైంది. మొత్తంగా ఈ కేసు బాలీవుడ్ లో, చర్చనీయాంశంగా మారింది. మార్చి 18న జరిగే తదుపరి విచారణలో ఏం జరుగుతుందో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: