हिन्दी | Epaper

Tenth Results : ఏప్రిల్ 22న ఏపీ టెన్త్ ఫలితాలు?

sumalatha chinthakayala
Tenth Results : ఏప్రిల్ 22న ఏపీ టెన్త్ ఫలితాలు?

Tenth Results : ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న లేదంటే రెండ్రోజులు అటూ ఇటుగా ఫలితాలు ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటితో మూల్యాంకనం పూర్తికాగా, ఫలితాలను కంప్యూటరీకరించే ప్రక్రియ మొదలుపెట్టారు. పలు దఫాల పరిశీలన పూర్తయ్యాక ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది. ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా తెలుసుకోవాలన్న దానిపై ఎస్సెస్సీ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ ఆప్షన్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

 ఏప్రిల్ 22న ఏపీ టెన్త్

ట్సాప్ ద్వారా కూడా ఫలితాలు

ఈసారి రాష్ర్లంలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుండి 30 వరకు నిర్వహించారు. ఇందులో 6.5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా ఎప్పటిలాగే పదో తరగతి పరీక్షా ఫలితాలను bse.ap.gov.in వెబ్‌సైట్‌ లో ప్రభుత్వం అందుబాటులో ఉంచబోతోంది. వెబ్ సైట్ లోకి ఎంటర్ అయ్యాక విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వివిధ ప్రైవేటు వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులోకి రాబోతున్నాయి. కాబట్టి విద్యార్ధులు అప్పటివరకూ వేచి చూడక తప్పదు.

Read Also: పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు: కవిత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870