ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన రీ రిలీజ్ హంగామా కనిపిస్తుంది.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని ‘గుంటూరు కారం’ చిత్రంతో థియేటర్లలో సందడి చేశారు.అయితే నెక్ట్స్ జక్కన్న డైరెక్షన్ లో నటిస్తున్న ఎస్ఎస్ఎమ్ బి 29 చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో పక్కాగా తెలియని పరిస్థితి. ఇక మహేశ్ బాబును మళ్లీ థియేటర్లలో చూడాలంటే అభిమానులు చాలా కాలం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ క్రమంలోఅభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఎస్ఎస్ఎంబీ29 కంటే ముందే థియేటర్లలో సందడి చేయబోతున్నారు. మహేశ్ బాబు కెరీయర్ లోని హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పోకిరి’, అలాగే సూపర్ హిట్ ఫిల్మ్ ‘బిజినెస్ మ్యాన్’ చిత్రాలు రీరిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. రీ రిలీజ్ ల్లోనూ ఈ చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టాయి.
విడుదల
మరికొద్ది నెలల్లో మహేశ్ బాబు పుట్టిన రోజు ఉన్నందున ముందేగానే రీరిలీజ్ ల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా మహేశ్ బాబు కెరీర్ లో మంచి విజయాన్ని సాధించిన 4 చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా ఆ రీరిలీజ్ సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలను కూడా ఫిక్స్ చేశారు.’బ్రహ్మోత్సవం’ సినిమా వచ్చి 9 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, కృష్ణ జయంతి సందర్భంగా మే 30న రీ-రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అలాంటి కళాఖండాన్ని మరోసారి విడుదల చేయడం అవసరమా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, యాంటీ ఫ్యాన్స్ నుంచి ఇంకోసారి ట్రోలింగ్ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని జోకులు వేసుకుంటున్నారు.
రీరిలీజులు
‘బ్రహ్మోత్సవం’ సినిమాతో మహేష్ బాబు రీరిలీజులు ఆగిపోవడం లేదు. నిన్న ఏప్రిల్ 18న ‘అతడు’ 4కె చిత్రాన్ని ఆరోసారి కొన్ని థియేటర్లలో విడుదల చేసారు. ఏప్రిల్ 26న ‘భరత్ అనే నేను’ సినిమా రానుంది. మే 30న ‘ఖలేజా’ 4కె మూవీని రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘టక్కరి దొంగ’ ‘అతిథి’ సినిమాలలో ఒకటి మహేష్ బర్త్ డే స్పెషల్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఏడాది పొడవునా సూపర్ స్టార్ పాత సినిమాలు రీరిలీజులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘ఎస్ఎస్ఎమ్ బి 29’ రావడానికి ఇంకా టైం ఉండటంతో, ఈ గ్యాప్ లో రీరిలీజులతో పండుగ చేసుకుంటున్నారు. మహేష్ ఫ్యాన్స్ ను నిలువునా దోపిడీ చేస్తున్నారనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
Read Also: Samantha: శ్రీవారి సన్నిధి లో సమంత