వైసీపీ అధినేత, మాజీ సీఎంజగన్ గుంటూరు జిల్లా తెనాలి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. తెనాలిలో నడిరోడ్డుపై ముగ్గురి రౌడీ షీటర్లను పోలీసులు బహిరంగంగా చావబాదిన ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ అక్కడికి వెళ్లి వారి కుటుంబాల్ని పరామర్శించేందుకు సిద్దమయ్యారు.ఈ ఉదయం తెనాలికి జగన్ వస్తున్నారన్న సమాచారంతో ప్రజాసంఘాల కార్యకర్తలు నిరసనలకు రంగం సిద్ధం చేసుకున్నారు.తెనాలిలో జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాలతో పాటు కూటమి పార్టీల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. తెనాలి(Tenali)లోని ఐతానగర్ సెంటర్లలో జగన్ను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. తెనాలి మార్కెట్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. రౌడీషీటర్లకు జగన్ మద్దతుగా నిలిచారంటూ దళితసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి కూటమి పార్టీలు మద్దతుగా నిలిచాయి.
సామాన్యులపై
జగన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో నల్లబెలూన్లతో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. జగన్కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. తెనాలిలో సామాన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, గంజాయి విక్రయాలకు పాల్పడిన ముఠా సభ్యులను పరామర్శించేందుకు జగన్ రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వాగ్వాదం
గత ఏప్రిల్ 25న తెనాలిలో జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులపై కొందరు పోలీసులు అత్యంత దారుణంగా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ యువకులు దళిత, మైనారిటీ వర్గాలకు చెందినవారని తెలుస్తోంది. గంజాయి వాడుతున్నారనే అనుమానంతో ఓ పోలీసు కానిస్టేబుల్(Constable)తో ఈ యువకులకు వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాతే రద్దీగా ఉండే రోడ్డుపై అందరూ చూస్తుండగా పోలీసులు వారిని కింద కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మే 26న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Tenali : జాన్ విక్టర్ కుటుంబానికి నేడు జగన్ పరామర్శ