ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగించినప్పటికీ,ఆ విజయమే కొంతమంది ప్రాణాల్ని తీసింది.ఈ నేపథ్యంలో,ఐపీఎల్ అభిమానం ఓ యువకుడి ప్రాణం తీసింది. మరికొందరు పోలీసు కేసులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఆర్సీబీ అభిమానులు విజయవాడలో చేసిన అత్యుత్సాహంపై చర్యలు ప్రారంభించారు పోలీసులు. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
బందర్ రోడ్డు
ఆర్సీబీ గెలుపు బెంగళూరులోనే కాదు బెజవాడలోనూ భయబ్రాంతులకు గురి చేసింది. క్రికెట్పై అభిమానం హద్దులు దాటింది. విజయవాడ(Vijayawadaలో మే 3వ తేదీన అర్థరాత్రి ఆర్బీసీ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బందర్ రోడ్డులో పోలీసులు ఏర్పాటు చేసే బారీ కేడ్స్ లాక్కెళ్లారు. బందర్ రోడ్డు మొత్తం బ్లాక్ చేసి డ్యాన్సులు వేడయంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైకి కూడా ఎక్కారు. డివైడర్ల(Dividers) మధ్యలో ఉన్న చెట్లను పీకేసి వాటితో నానా హంగామా చేశారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. బారీకేడ్లు లాక్కెల్లిన వారికి పోలీస్ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు.

రోడ్లపై వేడుకలు
అయితే ఈ రచ్చలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. బందర్ రోడ్డులో ముగ్గురు యువకులు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఓవర్స్పీడ్లో బైక్పై వెళ్తుండగా, అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో శేఖర్(Shekhar) అనే యువకుడిపై ఓ కారు దూసుకెళ్లింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శేఖర్ విజయవాడ రైల్వే పార్శిల్ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మాచవరం పోలీసులు ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.హద్దులు మీరి, ఎలాంటి పర్మిషన్లు లేకుండా రోడ్లపై వేడుకలు చేయడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా.. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. తాము చేసిన తప్పు ఎవరూ చేయొద్దని.. యువకులతోనే చెప్పిస్తున్నారు.
Read Also: AP DSC ,TG TET: ఒకే తేదీల్లో ఏపీ డీఎస్సీ, తెలంగాణ టెట్ అయోమయంలో అభ్యర్థులు