हिन्दी | Epaper

Andhra Pradesh: జూన్ 2 నుండి విజయవాడ బెంగళూర్ విమానసేవలు

Anusha
Andhra Pradesh: జూన్ 2 నుండి విజయవాడ బెంగళూర్ విమానసేవలు

కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపికబురు చెప్పింది.రాష్ట్రం నుంచి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్‌లకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తెలిపారు. రాష్ట్రంలో విమాన కనెక్టివిటీని పెంచడానికి ఈ కొత్త విమానాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం-అబుదాబి మధ్య విమాన సర్వీసులు జూన్ 13 నుంచి ప్రారంభమవుతాయని,ఈ విమానాలు వారానికి నాలుగు రోజులు నడుస్తాయన్నారు. దీని ద్వారా యూఏఈ, ఇతర దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది అంటున్నారు.విశాఖపట్నం-భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12 నుంచి మొదలవుతుందని,విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు జూన్ 2 నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)’కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్’ కలను నెరవేర్చేందుకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడ నుంచి బెంగళూరుకు జూన్ 2 నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తాయని,దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం నుంచి బెంగళూరుకు సులువుగా చేరుకోవచ్చు అన్నారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రమంతటా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమానాలను ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అంటున్నారు.

136884409 airliner 3000x1000
విజయవాడ బెంగళూర్ విమానసేవలు

ప్రస్తుతం

రాష్ట్రంలోని ప్రజలకు మరింత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు, కొత్త విమాన మార్గాలు,ఆధునిక సదుపాయాలతో కూడిన సేవలపై దృష్టిసారిస్తున్నామని ఆయన చెప్పారు.మరోవైపు విజయవాడ నుంచి విశాఖపట్నంకు జూన్‌ 1 నుంచి నూతన విమాన సర్వీసును ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇండిగో సంస్థ (Indigo Company)ఈ సర్వీసును నిర్వహించనుంది. ఈ విమాన సర్వీసు ఉదయం 7:15కు విజయవాడలో బయలుదేరి విశాఖకు ఉదయం 8:25కు చేరుకుంటుందని పౌర విమానయానశాఖ మంత్రి కె రామ్మోహన్‌నాయుడు తెలిపారు. మళ్లీ తిరుగు ప్రయాణంలో అక్కడి నుంచి 8:45కు బయలుదేరి విజయవాడకు 9:45కు తిరిగివస్తుందన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉదయం వేళ విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ప్రస్తుతం చెన్నై నుంచి వచ్చి వెళ్లే ఒక్క సర్వీసు మాత్రమే నడుస్తోంది. ‘చెన్నై నుంచి విజయవాడకు(Vijayawada)ఉదయం 8.05కు వచ్చి, ఇక్కడి నుంచి 8.45కి బయలుదేరి విశాఖ వెళుతోంది. ఇందులో రద్దీ ఎక్కువగా ఉండటంతో చాలామంది విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లి, అక్కడి నుంచి విశాఖకు వెళ్లాల్సి వస్తోంది’ అంటున్నారు. ఈ క్రమంలో కొత్త సర్వీస్ ప్రారంభించారు.

Read Also :Security: జగన్ జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం హైకోర్టు లో పిటీషన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870