हिन्दी | Epaper

Andhra Pradesh: విశాఖలో కొత్తగా మూడు ప్రభుత్వ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్స్‌

Anusha
Andhra Pradesh: విశాఖలో కొత్తగా మూడు ప్రభుత్వ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్స్‌

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విశాఖపట్నంలో మహిళా ఉద్యోగుల కోసం సరికొత్త ఆలోచన చేసింది. నగరంలో మూడు చోట్ల మహిళా ఉద్యోగుల కోసం వసతి గృహాలు (హాస్టల్స్) నిర్మించడానికి పరిపాలన అనుమతులిచ్చింది. రూ.172 కోట్లతో ఈ మూడు హాస్టల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ముడసర్లోవలో రూ.90.54 కోట్లు, మధురవాడలో రూ.51.08 కోట్లు, నరవలో రూ.30.38 కోట్లతో నిర్మాణం చేస్తారు. ఈ హాస్టల్స్‌లో అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫుడ్‌ కోర్టు, వినోద, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, వాహనాల పార్కింగ్‌ ఇలా అన్ని రకాల సదుపాయాలతో హాస్టల్స్ నిర్మించనున్నారు.కేంద్రం సహకారంతో (ప్రత్యేక మూలధన పెట్టుబడి పథకం) ఈ హాస్టల్స్ నిర్మాణాలకు నిధులు కేటాయించారు. ఈ హాస్టల్స్ నిర్వహణను పీపీపీ విధానం కింద చేపట్టాల్సి ఉంది. ఈ హాస్టల్స్‌ను గ్రేటర్‌ విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఈ హాస్టల్స్‌కు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) ఎండీని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఆదేశించారు. విశాఖపట్నంలోని మూడు ప్రాంతాల్లో నిర్మించే ‘వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్స్‌’ నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

 Andhra Pradesh: విశాఖలో కొత్తగా మూడు ప్రభుత్వ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్స్‌

ప్రభుత్వం

విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌‌ ఎంతో ఉపయోగంగా ఉంటాయంటున్నారు. విశాఖపట్నానికి పలు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు వస్తున్నాయి. ఈ క్రమంలో నగరానికి మన రాష్ట్రంతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళా ఉద్యోగులు వసతి కోసం బయట రూమ్‌లు, ప్రైవేట్ హాస్టల్స్‌ను వెతుక్కోవాల్సి వస్తుంది.ఆర్థికంగా కూడా భారంగా మారింది. అదే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌‌ అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో హాస్టల్స్‌లో ఉండొచ్చు. హాస్టల్స్ వెతుక్కునే ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే ఈ హాస్టల్స్ నిర్మాణాలను చేపట్టే అవకాశం ఉందంటున్నారు. వీటి నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం వచ్చే మహిళా ఉద్యోగుల కోసం వసతి ఏర్పాట్లు చేసే పనిలో ఉంది.

Read Also :Gali Janardhan Reddy: ఓబుళాపురం కేసు విచారణలో కోర్టుకు చేరిన గాలి జనార్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870