हिन्दी | Epaper

Subramanya Swami: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి

Sharanya
Subramanya Swami: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పరిధిలోని గోశాలలో గోవులు పెద్ద ఎత్తున మృతి చెందిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఆరోపణలు, జరుగుతున్నాయి.

భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

టీటీడీ మాజీ ఛైర్మన్ మరియు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశాన్ని మొదట బయటపెట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోశాలలో అనేక గోవులు మృతి చెందినట్లు వెల్లడించారు. గోవుల మరణానికి సంబంధించిన పోస్టుమార్టం జరగలేదని, ఇది పాలకుల నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నదని అన్నారు. గోశాల నిర్వహణ బాధ్యత డీఎఫ్ఓ స్థాయి అధికారికి అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా విస్మయించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందన

ఈ వివాదంపై బీజేపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి స్పందించారు. తనకు ఈ విషయం టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన ద్వారా తెలిసిందని చెప్పారు.  దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేస్తానని తెలిపారు. గోశాలకు ఎటువంటి సంబంధం లేని డీఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమించారని, దీనిపై విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. భూమన ఆరోపణలను పలువురు మంత్రులు ఖండించడంతో పాటు ఆయనపైనే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

Read also: Purandeshwari : ముస్లింల ఓటు దుష్ప్రచారం చేస్తున్నారు: పురందేశ్వరి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870