हिन्दी | Epaper

ఏపీ లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

Anusha
ఏపీ లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

ఆంధ్రప్రదేశ్‌లో నేటి ఏపీ లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్. మార్చి1 నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి రానుంది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించనున్నారు. ప్రభుత్వం రోడ్డుప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది. వాహనదారులు ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది.

కొత్త నిబంధనలు

హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 1,000 జరిమానా

సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే రూ. 1,000 ఫైన్

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే రూ. 10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు

సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ కు రూ. 1,000 జరిమానా

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 5,000 ఫైన్ తో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం

ఇన్స్యూరెన్స్ లేకుండా వాహనం నడిపితే తొలిసారి రూ. 2 వేలు, రెండోసారి రూ. 4 వేలు జరిమానా

సెల్ ఫోన్ వాడుతూ వాహనం నడిపితే తొలిసారి రూ. 1,500 రెండోసారి రూ. 10 వేల ఫైన్

బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1,000 జరిమానా

వాహనాల రేసింగ్ కు పాల్పడితే తొలిసారి రూ. 5 వేలు, రెండోసారి రూ. 10 వేల ఫైన్

ఆటో డ్రైవర్లు యూనిఫాం లేకుండా వాహనం నడిపితే తొలిసారి రూ. 150, రెండోసారి రూ. 300 జరిమానా.

సీసీ కెమెరాల నిఘా

సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జరిమానాలు విధించనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు నిబంధనలు లోబడి నడుచుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు కోరుతున్నారు.వీటితో పాటుగా అతి వేగం, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి కేసులలో వేయి రూపాయల వరకూ జరిమానా విధిస్తారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే రూ.5000 జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసే అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

278983 earphones while driving

హైకోర్టు ఆదేశాలు

ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెల్మెట్ విషయంలో ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు.రాష్ట్రంలో జరుగుతున్న బైక్ యాక్సిడెంట్లపై ఏపీ హైకోర్టు ఇటీవల విచారణ నిర్వహించింది. ఈ తరహా ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవటంపై ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు. హెల్మెట్ ధరించి ఉంటే బాధితుల్లో ఎక్కువ శాతం మంది బతికి ఉండేవారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయాలని పోలీసులను ఆదేశించింది.

ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు

హెల్మెట్ వాడకం పెరిగితే రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారికి జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.ఏపీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి హెల్మెట్ అమలు చేయనున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

📢 For Advertisement Booking: 98481 12870