हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nara Lokesh: ప్రైవేట్ వర్సిటీలను అడ్డుకున్న వైసీపీ: లోకేష్

Ramya
Nara Lokesh: ప్రైవేట్ వర్సిటీలను అడ్డుకున్న వైసీపీ: లోకేష్

వాస్తవాలను అంగీకరించని వైసీపీ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై వాస్తవాలను అంగీకరించే స్థితిలో వైసీపీ లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మండలిలో వైసీపీ సభ్యులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో సందేహాలు వ్యక్తం చేయగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తగిన వివరణ ఇచ్చారు. అయినా కూడా వైసీపీ సభ్యులు వాస్తవాలను అంగీకరించకుండా నిరాధార ఆరోపణలు చేస్తూ అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసుకుంటూ బయటకు వెళ్లారని లోకేశ్‌ విమర్శించారు.

మండలిలో చర్చ నుంచి వైసీపీ ఎందుకు తప్పుకున్నది?

విద్యారంగంపై మండలిలో సమగ్ర చర్చ జరుగుతుంటే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లిపోయారని మంత్రి ప్రశ్నించారు. ‘‘ఆ రోజు అసెంబ్లీలోనే అన్ని వివరాలు వెల్లడించాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టమైన వివరణ ఇచ్చాం. మీరు ఎందుకు బహిష్కరించారు? ఎందుకు చర్చకు హాజరు కాలేదు? ఇప్పుడు మళ్లీ అనవసరమైన ఆరోపణలు చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు’’ అని మండిపడ్డారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై నిజాలు ఇవే

వైసీపీ హయాంలో రూ. 4,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉండిపోయాయని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ‘‘వాస్తవాలు అంగీకరించడానికి వైసీపీ సిద్ధంగా లేదు. మా ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని చెల్లింపులు పూర్తిగా చేస్తోంది. స్కూల్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అన్ని అంశాల గురించి పూర్తి వివరాలు పంపిస్తాం. గత ప్రభుత్వ పాలనలో అనేక నెలల పాటు బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. 2019లో ఆనాటి ప్రభుత్వం వదిలేసిన బకాయిలను 16 నెలల తర్వాత చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది’’ అని చెప్పారు.

ప్రస్తుత ప్రభుత్వ వైఖరి

‘‘మా ప్రభుత్వం 10 నెలల క్రితమే అధికారంలోకి వచ్చింది. విద్యార్థులపై మనసున్న ప్రభుత్వం, విద్యారంగంపై ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం కావడంతో బకాయిలను చెల్లించేందుకు కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలోనే హామీ ఇచ్చాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తప్పకుండా చెల్లిస్తాం. కానీ, వైసీపీ సభ్యులు అసలు చర్చకు హాజరుకాకుండా ఆరోపణలు చేయడం అర్థరహితం’’ అని లోకేశ్‌ తిప్పికొట్టారు.

విద్యారంగంపై వైసీపీ అసలు చర్చించాలనుకోలేదా?

బీఏసీ సమావేశంలో విద్యారంగంపై చర్చకు తాము అంగీకరించామని, కానీ చివరి నిమిషంలో వైసీపీ సభ్యులే చర్చకు గైర్హాజరయ్యారని తెలిపారు. ‘‘వాస్తవాలు వింటే ఎక్కడ ముసుగుతీరిపోతుందనే భయంతోనే వైసీపీ సభ్యులు చర్చకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను పూర్తిగా చదవాల్సిన అవసరం ఉంది. చదవకుండానే విమర్శలు చేయడం తగదు’’ అని హితవు పలికారు.

వసతి దీవెనను ఎప్పుడూ సక్రమంగా చెల్లించని వైసీపీ

వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిందని డోలా బాలవీరాంజనేయస్వామి విమర్శించారు. ‘‘వసతి దీవెనను సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. అనేక మంది పేద విద్యార్థులు తమ చదువు కొనసాగించలేకపోయారు. ఈ పరిస్థితులకు వైసీపీనే బాధ్యత వహించాలి. తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ హామీ

ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని చెల్లింపులు తక్షణమే జరిపేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడంతోపాటు, పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం మా బాధ్యత’’ అని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870