हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

AndhraPradesh :నేడు కడప జడ్పీ ఛైర్మన్ ఎన్నిక

Anusha
AndhraPradesh :నేడు కడప జడ్పీ ఛైర్మన్ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కడప జిల్లాపరిషత్ (జడ్పీ) ఛైర్మన్ ఎన్నిక నేడు (మార్చి 26) జరుగనుంది. ఎన్నిక నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటలకు ఛైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాపరిషత్‌లో మొత్తం 50 మంది జడ్పీటీసీలు ఉన్నారు. వీరిలో 38 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) చెందిన వారే కావడంతో, ఈ పదవి మళ్లీ వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైసీపీకి ఊరట

ఈ ఎన్నికలో తమ పార్టీ తరఫున పోటీ చేయబోమని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇప్పటికే ప్రకటించింది. దీంతో వైసీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం కేవలం ఒక అధికారిక ప్రక్రియ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఎన్నిక ప్రక్రియ చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరగుతాయేమో అనేది ఉత్కంఠగా మారింది.

అమర్నాథ్ రాజీనామా

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విధులు నిర్వర్తిస్తూ, కొంతకాలం క్రితం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా కారణంగా జిల్లా పరిషత్‌లో ఛైర్మన్ పదవి ఖాళీ అవ్వడంతో, అధికార పార్టీ ఎన్నిక నిర్వహించాల్సివచ్చింది.

నేడు కడప జడ్పీ ఛైర్మన్ ఎన్నిక

రామగోవిందరెడ్డి

ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా బ్రహ్మంగారిమఠం మండలం జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ప్రకటించారు. ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ జడ్పీటీసీలను నాలుగు రోజుల పాటు క్యాంపులో ఉంచారు.హైదరాబాద్ క్యాంప్ నుంచి కడపకు చేరుకున్న వైసీపీ సభ్యులు.

వైసీపీ విప్ జారీ

వైసీపీ అధిష్ఠానం తమ జడ్పీటీసీలకు విప్ జారీ చేసింది. అంటే, పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా ఏదైనా వేరొకరిని గెలిపించే ప్రయత్నం చేస్తే, ఆ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో, క్రాస్‌ ఓటింగ్‌ లేదా సభ్యులు గైర్హాజరు కావడం వంటి అంశాలకు తావులేకుండా చేయాలని అధికార పార్టీ కృషి చేస్తోంది.టీడీపీ పోటీ నుండి తప్పుకున్నా, చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎవరైనా నామినేషన్ వేస్తారా? లేదా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870