हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Murali Nayak: ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి జ‌గ‌న్‌ ఆర్ధిక సాయం

Anusha
Murali Nayak: ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి జ‌గ‌న్‌ ఆర్ధిక సాయం

భారత్‌-పాకిస్తాన్‌ ఉద్రిక్తతల వేళ దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్‌ కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని మురళీ నాయక్ ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. మురళీ నాయక్(Murali Nayak) చిత్రపటానికి నివాళులు అర్పించారు. దేశం కోసం మురళీ నాయక్ త్యాగం చేశారన్న వైఎస్ జగన్ ఎంతోమందికి మురళీ నాయక్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు అండగా ఉంటామని జగన్‌ భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్(YS Jagan) రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు వైఎస్ జగన్ చెప్పారు.మరోవైపు అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే పద్ధతిని వైసీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టామన్న వైఎస్ జగన్ ఈ ఆనవాయితీని కొనసాగించినందుకు టీడీపీ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) కూడా ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 50 లక్షల ఆర్థిక సాయంతో పాటుగా మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మురళీ నాయక్ కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ఆపరేషన్ సిందూర్‌

మురళీనాయక్‌‌కు చిన్నతనం నుంచే సైన్యంలో పనిచేయాలని కోరిక. అదే కోరికతో కష్టపడి ఆర్మీలో చేరారు. రైల్వేలో ఉద్యోగం వచ్చినా కూడా వదిలేసి అగ్నివీర్ కింద ఆర్మీలో చేరారు. 2022 డిసెంబరులో అగ్నివీర్‌గా ఎంపిక అయిన మురళీ నాయక్ తొలుత పంజాబ్, అస్సాంలలో పనిచేశారు. సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) వెళ్లిన మురళీ నాయక్ ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందారు. మరోవైపు ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలను ఏపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది.

Read Also: Andhra Pradesh: ఏపీలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎక్కడంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

అమరావతిపై జగన్ కావాలనే విష ప్రచారం

అమరావతిపై జగన్ కావాలనే విష ప్రచారం

మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

వైసిపి కుట్రలను తిప్పికొట్టండి: నారా లోకేష్

వైసిపి కుట్రలను తిప్పికొట్టండి: నారా లోకేష్

టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్

టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్

629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు

629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు

ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

📢 For Advertisement Booking: 98481 12870