हिन्दी | Epaper

Vallabhaneni Vamsi: వల్లభనేని కేసు లో నేడు సీఐడీ కోర్టు తీర్పు

Anusha
Vallabhaneni Vamsi: వల్లభనేని కేసు లో నేడు సీఐడీ కోర్టు తీర్పు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు సీఐడీ కోర్టు తీర్పును వెల్లడించనుంది. మంగళవారం నాటి విచారణలో ఇరుపక్షాల వాదనలు ముగియగా, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.వంశీకి బెయిల్ వస్తుందా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఆరోపణలు

టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రేరేపించారని ఆరోపణలు ఉన్నాయి.ఘటన జరిగిన సమయంలో దాడికి సంబంధించి మార్గదర్శకత్వం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడీ కోర్టులో వాదనలు వినిపించింది.

సీఐడీ వాదనలు

సీఐడీ తరఫున న్యాయవాదులు వంశీకి బెయిల్ మంజూరు చేయకూడదని వాదించారు.ఆయనకు బెయిల్ ఇస్తే కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు.దాడి ఘటనలో వంశీ కీలక పాత్ర పోషించారని, విచారణను ఎదుర్కొనే వరకు ఆయనను జైల్లోనే ఉంచాలని అభ్యర్థించారు. ఈ కేసును రాజకీయ కక్షల్లో భాగంగా పెట్టారని,వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఆయన తప్పించుకునే ఉద్దేశ్యం లేదని, విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

398026 vamsi

కోర్టు తీర్పుపై ఉత్కంఠ

ఇరుపక్షాల వాదనలు ముగిసిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఈరోజు వెలువడనుంది.వంశీకి బెయిల్ వస్తుందా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.కోర్టు తీర్పు,భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులపై ఎలా ఉండబోతుందనేదానిపై ఆశక్తి నెలకొంది.

బెయిల్

వంశీ బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇవాళ వెలువడనుంది.సీఐడీ తరఫు వాదనలు – సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.వంశీ తరఫు వాదనలు – ఆరోగ్య సమస్యలు, రాజకీయ కక్షలో భాగంగా కేసు పెట్టారని న్యాయవాది వాదనలు వినిపించారు.తీర్పు వచ్చే వరకు ఉత్కంఠ నెలకొననుంది.వంశీ అనుచరులు, కుటుంబ సభ్యులు ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు.వంశీకి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే తప్పుడు ఆరోపణలు మోపారని వాదిస్తున్నారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని వంశీ న్యాయవాదులు కోరుతున్నారు.వైసీపీ నేతలు మాత్రం న్యాయపరంగా విచారణ జరుగుతోందని, దాడికి కారకుడైన వంశీపై చర్యలు తీసుకోవడం సహజమని అంటున్నారు.ఇప్పటికే, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా, వంశీ జైల్లో సౌకర్యాలపై న్యాయాధికారితో చర్చించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

పెద్ద దిక్కును కోల్పోయిన జర్జంగి

పెద్ద దిక్కును కోల్పోయిన జర్జంగి

బీసీ రక్షణ చట్టంపై నేడు కీలక సమావేశం

బీసీ రక్షణ చట్టంపై నేడు కీలక సమావేశం

పలాస కేంద్రీయ విద్యాలయలో తరగతులు షురూ!

పలాస కేంద్రీయ విద్యాలయలో తరగతులు షురూ!

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్: బిట్స్ పిలానీ భారీ ప్రణాళిక!

దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్: బిట్స్ పిలానీ భారీ ప్రణాళిక!

📢 For Advertisement Booking: 98481 12870