हिन्दी | Epaper

శరవేగంగా అమరావతి హైవే పనులు

Anusha
శరవేగంగా అమరావతి హైవే పనులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేషనల్ హైవేల ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా జాతీయ రహదారి నిర్మాణ పనులు పురోగమిస్తుండగా, విశాఖపట్నం జిల్లాలో అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న కీలకమైన నేషనల్ హైవే విస్తరణకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పెందుర్తి-బొడ్డవర 516బి జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.782.91 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు.

నేషనల్ హైవే

నేషనల్ హైవే విస్తరణలో మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా చాగలమర్రి నుంచి ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లె వరకు 78.95 కిలోమీటర్ల మేర సాగుతోంది. నేషనల్ హైవే 440లో విస్తరణ పనుల కోసం గత డిసెంబరులో రూ.1059 కోట్లతో టెండర్ ప్రక్రియ ముగియగా, భూసేకరణ పూర్తయింది. ఈ నెల 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం నుండి వర్చువల్ విధానంలో ఈ పనులకు శంకుస్థాపన చేశారు.

రహదారుల పనులు

అమరావతికి కనెక్ట్ అయ్యే రహదారుల పనులు వేగంగా సాగుతున్నాయి. గత నెల 27న ఈ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారు కాగా, పనులు త్వరలో ప్రారంభమవనున్నాయి. ముఖ్యంగా అమరావతికి కనెక్ట్ చేసే రహదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. కేంద్ర ప్రభుత్వం నడికుడి, మాచర్ల, మార్కాపురం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ హైవేకు 167ఏడిగా నామకరణం చేశారు. ఈ విస్తరణలో భాగంగా మాచర్ల బైపాస్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది.

శరవేగంగా అమరావతి హైవే పనులు

బ్రిడ్జిలు

మాచర్ల బైపాస్‌లో మొత్తం మూడు బ్రిడ్జిలు నిర్మించగా, ఒకటి సాగర్ రహదారి మీదుగా, మరొకటి చంద్రవంక వాగుపైన, మూడవది ఎన్టీఆర్ నగర్ కాలనీలో రైల్వే బ్రిడ్జిగా ఉండనుంది. రైల్వే గేటు మూసివేసినప్పుడు స్థానికులు అనేక ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో 167ఏడి విస్తరణలో భాగంగా రైల్వే బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.రైల్వే బ్రిడ్జి పూర్తయిన తర్వాత రాయవరం జంక్షన్ నుండి బైపాస్ మీదుగా మార్కాపురం, సాగర్ వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. మాచర్ల పట్టణంలోకి ప్రవేశించకుండా ప్రయాణీకులు సులభంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. నేషనల్ హైవే విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల రాష్ట్ర రహదారుల కనెక్టివిటీ మెరుగవడంతో పాటు వాణిజ్య, రవాణా సౌకర్యాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870