హైదరాబాద్లోని ఉప్పల్ పరిధిలో ఒక చిన్న వాట్సాప్ వివాదం ఒక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలను బలితీసుకుంది. సిటీ సెక్యూరిటీ వింగ్లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పి. సుధీర్ కుమార్కు, అతని పాత స్నేహితుడు సంతోష్ నాయక్కు మధ్య ఆదివారం రాత్రి ఫోన్లో మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ఒకరినొకరు దూషించుకోవడంతో గొడవ పెద్దదైంది. విషయాన్ని నేరుగా తేల్చుకుందామని సంతోష్ పిలవడంతో సుధీర్ అక్కడికి వెళ్లారు.
Read also: Malkajgiri Crime: ఆర్థిక మంత్రి పేరుతో డీప్ ఫేక్ స్కామ్..

Hyderabad Crime: WhatsApp Chatting Claims Constable’s Life
కత్తితో కిరాతకంగా దాడి
చిలుకానగర్ లోని ఆదర్శ్ నగర్ కాలనీ వద్ద ఇద్దరూ కలుసుకున్న సమయంలో వాగ్వాదం పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సంతోష్ నాయక్, తన వద్ద ఉన్న కత్తితో సుధీర్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఛాతీ మరియు మెడ భాగాల్లో తీవ్రమైన గాయాలు కావడంతో సుధీర్ అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. హత్య చేసిన అనంతరం నిందితుడు తన మరో స్నేహితుడితో కలిసి బైక్పై పరారయ్యాడు.
పోలీసుల గాలింపు చర్యలు
సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న సంతోష్ నాయక్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేవలం వాట్సాప్ చాటింగ్ వల్లే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: