jagan vijaysaireddy ycp

విశ్వసనీయత అనేది ముఖ్యం: జగన్

వైకాపాను వీడిన రాజ్యసభ ఎంపీ లపై ఆ పార్టీ అధ్యక్షడు జగన్ స్పందించారు.వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సీఎం జగన్ ఈరోజు స్పందిస్తూ బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని జగన్ అన్నారు. ప్రలోభాలకు లొంగో, భయపడో లేదా రాజీపడో వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు.ఇంకా ఒకరో ఆరో వెళ్లిపోయేవాళ్ళుంటే వాళ్ళకైనా అంతేనని వాఖ్యానించారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని ఐదేళ్లు కష్టపడితే మన సమయం వస్తుందని అన్నారు. విజయసాయిరెడ్డికైనా, మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు.

1400942 ys jagan mohan reddy

వైకాపా నేడు ఇలా ఉందంటే అది నాయకుల వల్ల కాదని చెప్పారు.అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని జగన్ అన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరుపై వాళ్లు ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమని అన్నారు. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అన్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు. లిక్కర్ వ్యవహారంతో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? అని జగన్ ప్రశ్నించారు. మిథున్ తండ్రి పెద్దిరెడ్డి ఏ శాఖకు మంత్రి? ఆయనకు లిక్కర్ కు ఏం సంబంధమని అడిగారు. ఎవరినో ఒకరిని ఇరికించడం, కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని విమర్శించారు.

Related Posts
అంబటి రాంబాబు పై కేసు నమోదు.. !
case has been registered against Ambati Rambabu.

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయింది. ఏపీ పోలీసులు అంబటి రాంబాబు పై కేసు నమోదు చేశారు. టీడీపీ, జనసేన Read more

CPS: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
AndhraPradesh: సీపీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఆర్థిక చర్యల ద్వారా, సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. గతంలో Read more

చంద్రబాబు విందుకు అమిత్ షా
babu amithsha

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు ఏపీకి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్ళి, సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు Read more

బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్
బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్

బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ సెమిస్టర్ పరీక్షా పత్రం లీకేజీ వివాదం విద్యా రంగంలో Read more