ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇటీవల కుటుంబంతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. శనివారం నాడు న్యూఢిల్లీకి వెళ్లిన లోకేశ్, ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి స్నేహపూర్వకంగా ముచ్చటించారు.ఇటీవల అమరావతికి వచ్చిన సందర్భంగా, Nara Lokesh ను ఢిల్లీకి రావాలని ప్రధాని స్వయంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ ఆహ్వానానికి స్పందనగా, ఈ సమావేశం ఏర్పడింది. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ హృదయపూర్వకంగా సాగింది.ఈ సందర్బంగా, నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రపై రూపొందించిన ప్రత్యేక కాఫీ టేబుల్ బుక్ను మోదీ ఆవిష్కరించారు.

ఈ పుస్తకంలో లోకేశ్ 2024 ఎన్నికలకు ముందు సాగించిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలు ఉన్నాయి. పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ, దానిపై సంతకం చేసి లోకేశ్కి అందజేశారు.ఈ భేటీలో మోదీ, లోకేశ్ దంపతులతో సుదీర్ఘంగా మాట్లాడారు. వారి కుమారుడు దేవాన్ష్ను మోదీ సన్నిహితంగా పలకరించి ఆప్యాయత చూపారు. చిన్నారితో సరదాగా మాట్లాడిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.లోకేశ్ తన ట్విట్టర్ ‘ఎక్స్’ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రధానిని కలిసిన అనుభవాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. “ఈరోజు ప్రధాని మోదీని కుటుంబంతో కలిసినందుకు గర్వంగా ఉంది.
రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు.దేశ భద్రతలో ఆయన నాయకత్వం ప్రశంసనీయం. వికసిత్ భారత్ లక్ష్యం వైపు సాగడంలో ఏపీ భవిష్యత్తు పాత్రపై మోదీ నుంచి విలువైన సూచనలు అందుకున్నా” అని ట్వీట్ చేశారు.ఈ భేటీ రాజకీయ దృష్టికోణంతో కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మధురంగా మిగిలింది. దేశాభివృద్ధికి ఏపీ ఎలా భాగస్వామ్యం అవ్వాలి అన్న దానిపై, లోకేశ్ సూచనలు తీసుకోవడం గమనార్హం.ఈ భేటీకి మానవీయ స్పర్శ, రాజకీయ ప్రాముఖ్యత రెండూ ఉన్నాయి. పాదయాత్ర విశేషాల పుస్తకం ఆవిష్కరణతో పాటు, కుటుంబ సంబంధాల ప్రాధాన్యతను కూడా ఈ సమావేశం చాటిచెప్పింది.
Read Also : New Currency Notes : త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనున్న ఆర్బీఐ