హీరో విజయ్ దళపతికి వై+ భద్రత

హీరో విజయ్ దళపతికి వై+ భద్రత

తమిళనాడుకు చెందిన ప్రముఖు నటుడు, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ దళపతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వై ప్లస్ భద్రతను కల్పించబోతున్నట్లు వివరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను కూడా జారీ చేయగా.. అంతా షాక్ అవుతున్నారు. తమిళనాడులో ఎన్నికలు ఏడాది తర్వాత ఉండగా.. ఇప్పుడే ఆయనకు భద్రత ఎందుకు కల్పిస్తుందని ఆలోచిస్తున్నారు. విజయ్ దళపతికి కేంద్ర హోంశాఖ వై ప్లస్ భద్రత కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 11 మంది సాయుధ గార్డులు షిఫ్టుల వారీగా 24 గంటల పాటు హీరోకు భద్రత కల్పించబోతున్నారు.

Advertisements
హీరో విజయ్ దళపతికి వై+ భద్రత

ముప్పు కారణంతోనే భద్రత

అసలు హీరోకు భద్రత కల్పించడానికి ప్రధాన కారణం ముప్పు పొంచి ఉండడమే. ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో పాటు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఈక్రమంలోనే ఆయనకు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్ర హోంశాఖ వై ప్లస్ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వై ప్లస్ భద్రత అంటే నాలుగో అత్యున్నత స్థాయి భద్రత. మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటల పాటు భద్రత కల్పిస్తారు. వీరిలో ఇద్దరి నుంచి నలుగురు కమాండోలు ఉండగా.. 7 నుంచి 9 మంది పోలీసులు ఉంటారు. అలాగే కాన్యాయ్‌లో ఒకటి లేదా రెండు వాహనాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ పద్ధతిలోనే హీరో విజయ్ దళపతికి భద్రత కల్పించింది సర్కారు.

సర్కారు ముందస్తు జాగ్రత్తగా..
తమిళ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి 2024లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా అదే ఏడాది తమిళ వెట్రి కజగం అనే పార్టీని కూడా స్థాపించారు. 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని వెల్లడించారు. ఈక్రమంలోనే కచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం రోజు ఎన్నికల వ్యాహకర్త, జన్‌సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌తో సమావేశం అయ్యారు. అనేక విషయాలపై చర్చించుకున్న తర్వాత.. విజయ్ దళపతికి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా టీవీకే పార్టీకి ప్రత్యేక సలహాదారుగా కూడా వ్యవహరించబోతున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలోనే సర్కారు ముందస్తు జాగ్రత్తగా ఆయనకు వై ప్లస్ భద్రత కల్పించింది.

Related Posts
Wife Harassment: :రోజుకు 5 వేలు ఇస్తేనే కాపురం చేస్తా..ఓ భార్య డిమాండ్!

బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ తన భార్య నుండి భరించలేని వేధింపులు ఎదుర్కొంటున్నానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజుకు రూ. 5,000 ఇస్తేనే కాపురం చేస్తానని Read more

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
delhi elections 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు Read more

ఓజీ చిత్రం పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఓజీ చిత్రం పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

పవన్ కళ్యాణ్ యొక్క కొత్త చిత్రం ఓజీ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.అందుకు సంబంధించిన విషయాన్ని ఆయన చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారని సమాచారం. తన ప్రైవేట్ షోలకు వచ్చే Read more

Manchu Manoj: తనపై ప్రతీకారంతోనే దాడులకు పాల్పడుతున్నారు:మంచు మనోజ్
తనపై ప్రతీకారంతోనే దాడులకు పాల్పడుతున్నారు:మంచు మనోజ్

గత కొంత కాలంగా, మోహ‌న్‌బాబు కుటుంబం వివాదాలు, గొడ‌వ‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. బుధ‌వారం నాడు మ‌రోసారి మంచు మ‌నోజ్ జ‌ల్‌ప‌ల్లిలోని నివాసం ముందు బైఠాయించి నిర‌స‌న‌కు దిగారు. Read more

×