Why are the flights going to Amritsar.. Punjab CM

ఆ విమానాలు అమృత్‌సర్‌కే ఎందుకొస్తున్నాయి..?: పంజాబ్ సీఎం

పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమన్న సీఎం

న్యూఢిల్లీ: అమెరికా నుంచి వలసదారులను తీసుకొచ్చిన విమానం గతవారం అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన విషయం విషయం తెలిసిందే. మొత్తం 104 మంది భారతీయులు ఈ విమానంలో స్వదేశానికి వచ్చారు. తాజాగా, మరో రెండు విమానాల్లో భారతీయులను అమెరికా నుంచి వెనక్కి పంపుతున్నారు. 119 మందితో ఓ విమానం ఆదివారం అమృత్‌సర్‌ విమానాశ్రయానికి చేరుకోనుంది. ఇంకో విమానం ఎప్పుడు వస్తుందనేది స్పష్టత లేదు.

 విమానాలు అమృత్‌ సర్‌కే  పంజాబ్

వలసదారుల విమానాలను తమ రాష్ట్రానికి పంపడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రపూరితంగానే వలసదారుల విమానాలను అమృత్‌సర్‌‌కు పంపుతోందని ఆయన విమర్శించారు. పంజాబ్‌ ప్రతిష్ఠను దిగజార్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఈ విమానాలను ల్యాండింగ్‌కు పంజాబ్‌నే ఎందుకు ఎంపిక చేశారని మాన్ ప్రశ్నించారు.

అమెరికా నుంచి భారతీయ వలసదారులతో బయలుదేరిన విమానం ఆదివారం తెల్లవారుజామున అమృత్‌సర్‌‌కు చేరుకోనుంది..ఏ ప్రమాణాల ఆధారంగా విమానం ల్యాండ్ చేయడానికి అమృత్‌సర్‌ను ఎంపిక చేశారో విదేశాంగ శాఖ సమాధానం చెప్పాలి… పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే మీరు ఎంపిక చేస్తున్నారు.. డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ భేటీ అయినప్పుడు మన ప్రజలకు అమెరికా అధికారులు సంకెళ్లు వేయడమేనా మన ప్రధానికి ఇచ్చిన బహుమతి అని భగవంత్ మాన్ విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పంజాబ్ పట్ల వివక్ష చూపుతోంది.. పంజాబ్‌ను ప్రతిష్ఠను దెబ్బతీసే ఏ అవకాశాన్ని వారు వదులుకోదు.. కుట్రలో భాగంగా, పంజాబ్, రాష్ట్ర ప్రజలను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు..అని ధ్వజమెత్తారు.

Related Posts
ఆర్జీ కార్ కేసులో నిందితుడి తల్లి ఆవేదన
ఆర్జీ కార్ కేసులో నిందితుడి తల్లి ఆవేదన

సంజయ్ రాయ్ తల్లి మాలతి రాయ్ శంభునాథ్ పండిట్ లేన్లలో నివసిస్తున్నారు. తన కుమారుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించడంపై మాలతి, "నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, Read more

Acer India: ఏసర్ ఇండియా..మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం
Monthly leave for female employees at Acer India

Acer India : ప్రముఖ ఇంజినీరింగ్‌ సంస్థ ఎల్‌అండ్‌టీ బాటలోనే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఏసర్ ఇండియా మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది. నెలసరి సమయంలో Read more

మోడీతో గూగుల్ CEO భేటీ – డిజిటల్ ఇండియాకు మద్దతుగా గూగుల్
మోడీతో సుందర్ పిచాయ్ భేటీ: భారత్ డిజిటల్ భవిష్యత్తుపై కీలక చర్చలు

మోడీతో సుందర్ పిచాయ్ భేటీ: భారత్ డిజిటల్ భవిష్యత్తుపై కీలక చర్చలు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మధ్య జరిగిన Read more

కుమార్తె వచ్చాకే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
Manmohan Singh

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన కాసేపటికే తుది శ్వాస విడవడం తెలిసిందే. మన్మోహన్ భౌతికకాయం ప్రస్తుతం ఢిల్లీలోని Read more