ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం జరుపుకుంటున్నాయి.ఈ భావనను మొదట 1992లో కెనడాలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ డెవలప్మెంట్ (ICOD) మరియు కెనడాలోని ఓషన్ ఇన్స్టిట్యూట్ (OIC) బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్ – UN కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (UNCED)లో ప్రతిపాదించాయి.ఓషన్ ప్రాజెక్ట్ 2002 నుండి ప్రపంచ మహాసముద్ర దినోత్సవం యొక్క ప్రపంచ సమన్వయాన్ని ప్రారంభించింది. “ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం”ను 2008లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించింది. అంతర్జాతీయ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (SDGs) అమలుకు మద్దతు ఇస్తుంది,సముద్ర రక్షణ,దాని వనరుల స్థిరమైన నిర్వహణపై ప్రజా ఆసక్తిని పెంపొందిస్తుంది. ,ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని అన్ని UN సభ్య దేశాలు జరుపుకుంటాయి.WOD ఏర్పడినప్పటి నుండి ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ ఉంది, ఇది వార్షిక కార్యక్రమాన్ని రూపొందిస్తుంది, మన మహాసముద్రాలు ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
నీరు లేకపోతె మానవుడు లేడు
ఈ విశ్వంలో ఇప్పటివరకూ భూమిపై మాత్రమే నీరు ఉన్నట్లు గుర్తించారు. మిగతా గ్రహాలపై ఉన్నది నీరో లేక నీటి లాంటి వేరే ద్రవమో తేలట్లేదు. అసలు భూమిపైకి నీరు ఎలా వచ్చిందనేది మిస్టరీ ప్రశ్న. జనరల్గా తోకచుక్కల (Comet) వెంట గడ్డకట్టిన నీరు ఉంటుంది. అలాంటి తోక చుక్కల నుంచి విడిపోయిన గడ్డల మంచు ఉల్కల (meteors) రూపంలో భూమిపై పడి నీరు వచ్చిందేమో అనే అంచనా ఉంది.ఎలా అయితేనేం నీరు వచ్చింది. ఆ నీటిలోనే జీవం పుట్టింది. నీటిలో పుట్టిన సూక్ష్మ జీవులు(Microorganisms) రూపాంతరం చెందుతూ రకరకాల చేపలుగా మారాయి. అలాంటి వాటిలో కొన్ని భూమిపైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వాటికి రెక్కల స్థానంలో కాళ్లు వచ్చాయి. తద్వారా అవి భూమిపై జీవించడం మొదలుపెట్టాయి. ఇలా భూమిపై జీవుల ఆవిర్భావం జరిగిందనే అంచనా ఉంది. ఇదంతా కొన్ని కోట్ల సంవత్సరాల్లో వచ్చిన మార్పు. అందుకే ఈ విశ్వంలో మన భూమి ఓ అద్భుతం. దానిపై నీరు మరో అద్భుతం.

నీరే అభివృద్ధికి చిహ్నం
నీరు ఉన్న చోటే ప్రాచీన నాగరికతలన్నీ వెలిశాయి. నైలూ నది దగ్గర ఈజిఫ్ట్ నాగరికత, అమెజాన్ నది దగ్గర మయన్ల నాగరికత, సింధూ నది దగ్గర హరప్పా మొహెంజోదారో నాగరికత(Sindu Civilization) ఇలా వచ్చినవే. నీరే అభివృద్ధికి చిహ్నం. నీరు లేని దేశాలకు ఎప్పటికైనా కరవు తప్పదు. అదృష్టం కొద్దీ మన భారత దేశానికి మూడు మహా సముద్రాలతో లింక్ ఉంది. ఎన్నో జీవ నదులకు పుట్టినిల్లు ఇండియా.సముద్రాల కల మండలాలు శక్తివంతమైన జీవవైవిధ్యానికి జీవింప జేసి, నీటి ఉత్పత్తులు, వాణిజ్య మార్గాలు, మత్స్య వనరులు, పర్యాటక అవకాశాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం సముద్ర ఉష్ణోగ్రతలు చరిత్రలో అత్యధికంగా, ప్లాస్టిక్ కాలుష్యం ఏకరూపతగా వ్యాప్తి చెందుతుంది. ప్రతి సంవత్సరం 11 దశల మిలియన్లు మేట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లో కలుస్తోంది .
Read Also: Wellness Places: వరల్డ్ టాప్ 5 వెల్నెస్ టూరిస్ట్ ప్లేసెస్ ఏవంటే?